DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమిత్ షా, మోడీ ల పర్యటనలను భారీ ఎత్తున నిర్వహిద్దాం: కన్నా 

విశాఖపట్నం, ఫిబ్రవరి 01 , 2019 (DNS Online): త్వరలో రాష్ట్ర పర్యటనకు రానున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షా, భారత ప్రధాని నరేంద్ర మోడీ ల పర్యటనలను భారీ ఎత్తున

నిర్వహించి, అత్యంత విజయం చెయ్యాలని రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం విశాఖ నగరానికి వచ్చిన ఆయన బీచ్ రోడ్ లోని

పార్టీ కార్యాలయం లో నగర పదాధికారుల సమావేశం లో ఆయన ముఖ్య అతిధిగా  à°ªà°¾à°²à±à°—ొన్నారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ à°ˆ నెల 16 à°¨ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖనగరం

లో పర్యటనకు రానున్నారని, దానికి భారీ ఎత్తున సన్నాహాలు చెయ్యాలని సూచించారు. అదే విధంగా à°ˆ నెల 4 à°µ తేదీన విజయనగరంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ à°·à°¾,  à°à°¡à±

పార్లమెంట్ నియోజకవర్గాల శక్తికేంద్రాల ఇంచార్జి లతో నిర్వహించనున్న సమావేశం గురించి వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కి అందించిన చేయూత, చేసిన

సాయం, కేటాయించిన నిధులు, ప్రోజక్టులు, జాతీయ విద్యా సంస్థలు తదితర అన్ని విషయాలను ప్రజల్లో భారీ ఎత్తున ప్రచారం చేయాలనీ సూచించారు. అదే విధంగా శుక్రవారం లోక్ సభ

లో ప్రవేశ పెట్టిన అత్యద్భుత బడ్జెట్ ను ప్రజల్లోకి చేరువ చెయ్యాలని తెలియచేసారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రం లో పర్యటించిన సమయంలో ప్రజల్లో మరింత

చైతన్యం కల్గించి, భారీ సంఖ్యలో స్వచ్చందంగా సభకు వచ్చే విధంగా ప్రచారం చెయ్యాలని సూచించారు. అంతకు ముందు ఈ నెల 10 వ తేదీన గుంటూరులో నిర్వహించనున్న మోడీ బహిరంగ

సభకు విశాఖపట్నం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరవ్వాలని పిలుపునిచ్చారు. అంతకుముందు శుక్రవారం మధ్యాహ్నం విజయనగరం లో అమిత్ షా నిర్వహించనున్న

సమావేశానికి తగిన ఏర్పాట్లు పరిశీలించేందుకు విజయనగరం వెళ్లి వచ్చారు.  

విశాఖ నగర అధ్యక్షులు ఎం. నాగేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ

కార్యవర్గ సభ్యులు, విశాఖపట్నం ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు, బీజేపీ రాష్ట్ర కో ఇంచార్జి సునీల్ డియోధార్, బీజేపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ

పివి చలపతిరావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగ నాగభూషణం, అడపా నాగేంద్ర, రాష్ట్ర అధికార ప్రతినిధీ సుహాసిని ఆనంద్, రాష్ట్ర కమిటీ  à°ªà±à°°à°¤à°¿à°¨à°¿à°§à±à°²à± సన్యాసిరాజు,

సాగి కాశీవిశ్వనాథరాజు, పులుసు జనార్దన్,  à°ªà°¿à°µà°¿  à°¨à°¾à°°à°¾à°¯à°£à°°à°¾à°µà±, à°Ÿà°¿  à°¸à±à°¬à±à°¬à°°à°¾à°®à°¿à°°à±†à°¡à±à°¡à°¿, నగర పదాధికారులు తదితరులు పాల్గొన్నారు

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #andhra pradesh #union

government  #budget  #lok sabha  #piyush goel  #goyal  #income  #taxes  #suhasini anand  #spokes person #kanna lakshminarayana  #narendra modi  #amit shah

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam