DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీజేపీ ఆఖరి ప్రయత్నానికి జండా ఊప్పేది అమిత్ షా నే 

ఆంధ్రాలో  à°†à°–à°°à°¿ ప్రయత్నమే కన్నా బీజేపీ బస్సు యాత్ర,

పలాస నుంచి కర్నూలు - తడ వరకు à°µà°¿à°¶à°¾à°–పట్నం, ఫిబ్రవరి 02, 2019 (DNS Online): కొన ఊపిరి తో ఉన్న భారతీయ జనతా పార్టీకి

ఆక్సిజన్ అందించాలని అనే ఆఖరి ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ బస్సు యాత్ర సోమవారం ప్రారంభం కానుంది. యీ బస్సు యాత్రను బీజేపీ

జాతీయ అధ్యక్షులు అమిత్ షా శ్రీకాకుళం జిల్లా పలాస లో జండా ఊపి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ యీ బస్సులో ప్రయాణించి, కేంద్ర ప్రభుత్వం

ఇంతవరకు అందించిన సాయాన్ని, కేటాయించిన నిధులను, జాతీయ స్థాయి సంస్థలను కేంద్ర మంత్రిత్వ శాఖల ప్రకారం ప్రతి ఒక్క పధకాన్ని ప్రజలకు వివరించి, చంద్రబాబు నాయుడు

నాటకాన్ని బట్టబయలు చేసేందుకు ఆఖరి పోరాటాన్ని చేయనున్నారు. యీ బస్సు పర్యటన శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి కర్నూలు వరకు, వరకు సాగనుంది. యీ బస్సు యాత్ర 15 రోజుల్లా

పాటు సాగి మొత్తం 85 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తుందన్నారు. యీ పర్యటన కర్నూల్ జిల్లా ఆదోనిలో ముగుస్తుంది. 
ఇప్పడికే అన్ని జిల్లాలోనూ యీ బస్సు యాత్ర

పర్యటన తేదీలను ఖరారు చేశారు. ప్రతి గ్రామం, మండలం లోని పార్టీ క్యాడర్ ను విస్తృతంగా వినియోగించనున్నారు. ఇప్పడికే జారిపోయిన పార్టీ క్యాడర్ ను తిరిగి

పార్టీలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఒక్కో జిల్లా పర్యటనలోనూ ఒక్కో కేంద్ర మంత్రిని తీసుకువచ్చి, ఆయా విభాగాల నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు

అందించిన ప్రాజెక్ట్ లు, నిధుల వివరాలు, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అండ్ కో చేసిన నిధుల కైంకర్యాలను కూలంకషంగా వివరించనున్నట్టు తెలుస్తోంది. యీ బస్సు యాత్ర

సఫలీకృతమైతే బీజేపీ à°•à°¿ యీ రాష్ట్రం లో ఆక్సిజన్ వచ్చినట్టే అని విశ్లేషకులు భావిస్తున్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #kanna lakshminarayana  #amit shah  #bus yatra  #srikakulam  #palasa  #kurnool  #nellore  #schemes 

#andhra pradesh

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam