DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పవన్ ను ఎదుర్కోలేక పార్టీ ఆఫీస్ పై దాడి పిరికిపంద చర్య : జనసేన 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 06, 2019 (DNS Online) : ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ పార్టీల్లో అసహనం పేరుకు పోయిందని,  à°…ందుకే జనసేన పార్టీ కార్యాలయాలపై భౌతిక దాడులు చేస్తున్నాయని, జనసేన

పార్టీ విశాఖ ప్రతినిధులు పాక సత్యనారాయణ, పసుపులేటి ఉషాకిరణ్, మండిపడ్డారు. గుంటూరు లోని పార్టీ కేంద్ర కార్యాలయం పై కొందరు రాజకీయ సైకోలు చేసిన భౌతిక దాడికి

నిరసనగా విశాఖ నగరంలోని శాంతియుత నిరసనలు తెలియచేసారు. బుధవారం గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్యాలయం ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద పెద్ద సంఖ్యలో

జనసైనికులు శాంతియుతంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇదే విధమైన భౌతిక దాడులు విశాఖపట్నం నగర పరిధిలోనూ జరుగు తున్నాయన్నారు. తాము ఎవరి జోలికి

రాలేదని, అధికార పార్టీ చేస్తున్న అవినీతి భాగోతాన్ని బయట పెట్టడం తో వీళ్ళ అవినీతి బండారం ప్రజలకి బహిర్గతమై పోవడంతో కొందరు సైకోల ద్వారా తమ పార్టీ కేంద్ర

కార్యాలయం పై దాడికి ప్రేరేపించి కార్యాలయ సిబ్బంది, జనసేన కార్యకర్తలపై భౌతిక దాడులను చేయించారన్నారు. తాము శాంతి కాముకులమే గాని శాంతి దూతలం కాదన్నారు. ఇకపై

తమ జోలికిగానీ, వస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ సినీ జీవితం ద్వారా లక్షలాది మంది ప్రజాభిమానులను సంపాదించుకున్నారు తప్ప, ప్రజల

ఆస్తులను దోచుకోలేదని, ప్రజా ధనం తో విదేశాల్లో జల్సాలు చేయలేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యే తానే ఒక నియంతగా తనకు తానే భావించుకుంటూ, తమకు అడ్డు చెప్పిన

వాళ్ళ పై దాడులు చేస్తున్నారన్నారు. ఇవేవీ అధికార పార్టీ మీడియా పత్రికలకు, టీవీ చానెళ్లకు కనపడడం లేదన్నారు.  à°¦à±€à°¨à°¿à°ªà±ˆ ప్రశ్నించే ఇతర మీడియా ప్రతినిధులపై అసభ్య

పదజాలంతో దూషించే మహా నేతలు ఈ అధికార పార్టీలోనే ఉన్నారని, దీనికి నిదర్శనం పశ్చిమగోదావరి జిల్లా యేనన్నారు. ఇక పై తాము అన్నింటికీ సన్నద్దంగానే ఉంటామని

హెచ్చరించారు. à°ˆ దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదన్నారు. 

విశాఖ లోనూ ఇదే తీరహా దాడులు : పోటు à°®à°¹à±‡à°·à± 

జనసేన చేపట్టిన ప్రచార కార్యాచరణను

జీర్ణించుకోలేక, సహించలేని ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులు, అసాంఘిక శక్తులను సమాజం పైకి వదులుతున్నారని జనసేన యూత్ ఫోర్స్ ప్రతినిధి పోటు à°®à°¹à±‡à°·à± అభిప్రాయం

పడ్డారు. ఇదే విధమైన ఘటనలు విశాఖ నగరం లోను జరుగుతున్నాయని, విశాఖపట్నం ఓల్డ్ డైరీ ఫాం 3వ వార్డులో జనసేన పార్టీ జెండా నిర్మాణం జరుగుతున్న సందర్భంలో గుర్తు

తెలియని వ్యక్తులు జెండా తీసేసారు. తాము పగలనక, రాత్రనక పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేసుకుంటూ ఎవరిని జోలికి వెళ్లకపోయినా, తమపై దాడులు జరుగుతున్నాయన్నారు.

ప్రతి రోజు నగర వీధుల్లో రాత్రి పూట విధుల్లో ఉండే పారిశుధ్య కార్మికులను కలుస్తూ వారికి తమ పార్టీ గుర్తు అయినా గాజు గ్లాసు లో వేడిగా తేనీరు ఇస్తూ మాటా మంతీ

జరుపుతున్నామన్నారు. ఇప్పడికే విశాఖ నగరం లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ మొదటి దశ  à°ªà±à°°à°šà°¾à°°à°‚ పూర్తి చేశామన్నారు. ఇదే సమయంలో తమపై దాడులు జరిగే అవకాశాలు

ఉన్నాయన్నారు.  à°ˆ నిరసనల్లో జనసేన యూత్ ఫోర్స్ ప్రతినిధులు రఘు, సునీల్, కఠారి తదితరులు పాల్గొన్నారు.

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #viswanadha raju  #bjp  #janasena  #telugudesam #party  #chandrababu naidu  #potu mahesh  #usha kiran #GVMC

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam