DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మీడియా ని చులకన చేసే నేతలకు అధికారం ఆమడ దూరం

బాబుకు, జగన్ కె తప్పలేదు, సబ్బం హరి ఎంత ?

నాలుగు టీవీలకే పరిమితమైతే à°† నాలుగు ఓట్లే పడతాయి 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 08, 2019 (సత్య గణేష్ ) : రాజకీయ నేతలకు ఇటీవల

కొత్త వ్యాధులు సంక్రమిస్తున్నాయి. తమకి తాము హై ప్రొఫైల్ లో ఊహించుకుంటూ లేనిపోని పోకడలకు పోతున్నారు. ప్రజల అభీష్టం మారితే తమ బ్రతుకు బస్టాండ్ అవుతుందన్న

కనీస విషయం కూడా పట్టించుకోకుండా నోటుకు ఓటు ఉందిగా అనే ధీమాలో ఉన్నవారికి ప్రజల నుంచి భారీ గుణపాఠం గతంలో తగిలింది, మరో మారు తగలడానికి సిద్ధం గా ఉంది. గతం లో

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత తనని తాను  à°¹à±ˆ ప్రొఫైల్ లో ఊహించుకుంటూ కేవలం ఇంగ్లిష్ మీడియా టీవీ ఛానెళ్లలో మాత్రమే మాట్లాడుతూ, ఇంటర్వ్యూలు ఇస్తూ నానా

హంగామా చేశారు. దీంతో తెలుగు మీడియా లోని టీవీ చానెల్స్, పత్రిక మాధ్యమాలు జగన్ కు పట్టా పగలే చుక్కలు చూపించాయి. అంతవరకూ కేవలం ఆంగ్ల మీడియా ఛానెళ్లలో మాత్రమే

కనిపించే స్వయం భావిత భావి ముఖ్యమంత్రి ఆశావాహు దెబ్బకి దిగి వచ్చి తెలుగు పత్రికా, టీవీ ప్రసార మాధ్యమాల ముందు వాలడం మొదలు పెట్టారు. అయినప్పటికీ గత అనుభవాల

దృష్ట్యా తెలుగు ప్రసార మాధ్యమాలు ఇప్పడికీ జగన్ ను వెంటాడుతూనే ఉన్నాయి.  

అదే విధంగా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుణ్ణి

సైతం ఏకంగా దశాబ్ద కాలం పాటు అధికారానికి దూరం చేసిన ఘనత ప్రజలది, మీడియాదే.  

అదే వైఖరిని పాటిస్తూ అనకాపల్లి మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రజలు ఎప్పుడో మరిచిపోయిన

వృద్ధ నాయకుడు సబ్బం హరి తనని తానూ భారీ హై ప్రొఫైల్ లో భావించుకుంటూ 
వీరిద్దరికంటే ఒక ఆకు ఎక్కువే చదివినట్టున్నారు. బిల్డప్ బాగా ఇచ్చుకోవడం మొదలు పెట్టారు.

ఆయన కేవలం నాలుగైదు తెలుగు ప్రసార మాధ్యమాల ముందు మాత్రమే వాలడం మొదలుపెట్టారు. అది కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉండే మాద్యమాలంటే చొక్కాలు

చింపేసుకునేంతగా పెరిగిపోయిందని మీడియా వర్గాలే ఎద్దేవా చేస్తున్నాయి. ప్రజారాజ్యం పుణ్యమా అని తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అనకాపల్లి

ఎంపీగా హరి గెలవడం జరిగింది. ప్రజారాజ్యం అందరికంటే వీక్ అభ్యర్థిని నిలపడం వల్లనే హరి గెలిచాడు అని ప్రత్యర్థులే ఒప్పుకున్నారు. ఒక్కసారి పార్లమెంట్ లో

అడుగు పెట్టగానే ప్రొఫైల్ పెరిగిపోయినట్టు భావించి స్థానిక మీడియా బేఖాతరు చెయ్యడం గమనార్హం. ఇతను నిర్వహించే సాధారణ విలేకరుల సమావేశం లో ఇతనికి భజన చేసే

చానెళ్లు తప్ప మరొకటి కనపడదు అంతే అతిశయోక్తి కాదు. అయితే ఇతను ఈ స్థాయి నేతగా ఎదగడానికి ప్రధాన కారణం స్థానిక మీడియానే. గల్లీ స్థాయిలో బిజినెస్ చేసుకునే

ఇతనికి కాంగ్రెస్ పార్టీ స్థానిక  à°Žà°¨à±à°¨à°¿à°•à°²à±à°²à±‹ టికెట్ ఇవ్వడం తో గెలవడానికి, తదుపరి ఢిల్లీ స్థాయికి వెళ్ళడానికి ప్రస్తుతం ఇతను విస్మరించిన ( ఇతను నిర్లక్ష్యం

చేస్తున్న) మీడియానే. ఇప్పుడు ఇతను వెంటేసుకు తిరుగుతున్న ఆ నాలుగైదు టీవీ చానెళ్లకు అప్పడికి అతీ గతీ లేవు, కనీసం సొంత చిరునామా కూడా లేవు. అలాంటిది తనని తాని

హైప్ చేసుకునే వాళ్లకి తిరిగి యధాస్థానం లోకి పంపెయ్యడానికే స్థానిక మీడియా వర్గాలు రంగం సిద్దం చేస్తున్నాయి. పైగా ఇతను విశాఖ పార్లమెంట్ స్థానానికి గాని,

విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గానే ఏదైనా పార్టీ టికెట్ ఇస్తారా అని గో... లాగా ఎదురు చూస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పడికే కాంగ్రెస్ పార్టీ బయటకి నెట్టేసింది,

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది, ప్రస్తుతం అర్రులు చేస్తున్న  à°…ధికార తెలుగుదేశం పార్టీ ఇతన్ని కనీసం పట్టించుకోవడం కూడా లేదు. ఇక జనసేన పార్టీ

సంగతి సరే సరి, గేటు దాకా కూడా రానిచ్చే పరిస్థితి లేదు. ఇతనికి ఏ పార్టీ టికెట్టు ఇచ్చిన ఓడించేందుకు మీడియా వర్గాలు రెడీ గా ఉన్నాయన్నది వాస్తవం. ఇప్పడికైనా

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి à°•à°¿ కల్గిన జ్ఞానోదయం ఇతనికి కూడా కలిగితే సానుకూల పరిస్థితులు లభించే అవకాశం ఉంది. 

అతి సర్వత్రా వర్జయేత్ అనే వాక్కు చంద్రబాబు

విషయం లోనూ, వైఎస్ జగన్ విషయం లోనూ రుజువైంది. ఇక హరి విషయం లో కూడా రుజువు అవ్వడమే మిగిలి ఉంది.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #sabbam hari  #telugu desam #congress  #anakapalle  #MP  #YSR Conress  #YS Jagan

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam