DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర పర్యటనకు వచ్చే మోడీ కి గట్టిగా బుద్ది చెప్పండి :చలసాని 

ఆంధ్రా à°•à°¿ రావడానికి మోడీ à°•à°¿ సిగ్గు ఉండాలి : చలసాని 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 08, 2019 (DNS  Online ) : విభజన హామీల్లో ప్రధాన మైన ప్రత్యేక హోదా గానీ, విశాఖ కేంద్రంగా రైల్వే

జోన్ గానీ ఇవ్వని ప్రధాని నరేంద్ర మోడీ ఏ మొహం పెట్టుకు వస్తాడని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. శనివారం విశాఖ నగరం లోని

విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నివహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఎపి పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి ఖాళీ పిడతలతో స్వాగతం పలకాలన్నారు. విభజన హామీలన్నీ

అమలు చేసే వరకూ మా ఉద్యమం కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలూ మాతో కలిసి వస్తున్నాయని, ఈనెల 10 à°¨ వస్తున్న మోదీకి మా నిరసన తెలుపుతాం. 
చంద్రబాబు

గారి డిల్లీ దీక్షకి సంఘీభావం ప్రకటిస్తామని తెలిపారు. గతంలో జగన్ పార్టీ డిల్లి ధర్నాకు కూడా మేము హాజరై మద్దతు ఇచ్చామని, చంద్రబాబుగారు డిల్లీలో చేస్తున్నది

ప్రభుత్వ పరమైన ఆందోళన అని చెప్పారన్నారు. మరి అన్ని పక్షాలనూ పిలవాలి కదా అన్నారు. విశాఖలో రైల్వే జోన్ లేనందున రైళ్లు నడవక ఇబ్బంది పడుతున్నారు. తిరుమల ఎక్స్

ప్రెస్ ఎంత ఆలస్యంగా నడుస్తోందో చూస్తూనే ఉన్నాం.
రాయల సీమ, ఉత్తరాంధ్రలకు అర్ధరూపాయి కూడ ఇవ్వలేదు. కానీ పార్లమెంటులో ఇచ్చినట్లు అబద్దాలు ఆడారు. ఏపిలో‌

రాజకీయ ప్రయోజనాలు‌ లేవని విస్మరిస్తున్నారు. కర్నాటక మాదిరే ఒడిసాలోనూ తెలుగువారిలో ప్రచారం చేస్తాం. రాజ్ నాధ్ సింగ్, ఉమాభారతీ ఏపికి అనుకూలంగా ఉన్నారు. మోదీ,

అమిత్ షా, జైట్లీ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. భారతీయులను విభజించి పాలించే ప్రయత్నం చేస్తే వేర్పాటు ఉద్యమం వస్తుంది జాగ్రత్త అని హెచ్చరించారు. ఈ సమావేశం

లో ప్రత్యేక హోదా సాధన సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #chalasani  #andhra pradesh  #special status  #visakha railway zone  #narendra modi  #prime minister

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam