DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనసేన కు ఆర్ధిక బలం లేకున్నా ఆశయ సిద్ది ఉంది : బాలరాజు 

ఎన్నికల బరిలోకి జనసేన సై. .బాధ్యతల కమిటీల ప్రమాణం 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 09, 2019 (DNS Online) : మిగిలిన పార్టీల మాదిరిగా జనసేన పార్టీకి ఆర్ధిక బలం లేదని, అయితే పవన్

కళ్యాణ్ కు, అయన  à°µà±†à°‚à°Ÿ నడుస్తున్న  à°œà°¨à°¸à±ˆà°¨à°¿à°•à±à°²à°•à± ఆశయ సిద్ది మాత్రమే ఉందని  à°®à°¾à°œà±€ మంత్రి పి. బాలరాజు అన్నారు. 
శనివారం విశాఖపట్నం లోని ఉత్తరాంధ్ర కేంద్ర

కార్యాలయం లో విశాఖ పార్లమెంటరీ కమిటీలు భాద్యతలు ప్రమాణ స్వీకారం చేశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశం లో మాజీ మంత్రి పి. బాలరాజు మాట్లాడుతూ రానున్న

ఎన్నికల బరిలోకి జనసేన పార్టీ సై అంటూ రంగం లోకి దిగిందని, ప్రజల్లో చైతన్యం కల్గించేందుకు జన సైనికులు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ఇతర పార్టీల తరహాలో

కుంభకోణాలు, ప్రజా నమ్మద ద్రోహం చెయ్యడం రాదనీ, తాము ఏమి చేయగలమో అదే ప్రచారం చేస్తున్నామని తెలియచేసారు. పవన్ కళ్యాణ్ ప్రసంగంలోని ప్రజలకు స్పష్టమైన నమ్మకం

కలుగుతోందని, అయన ఆశయ సాధనకు సాకార రూపం కల్పించడమే జన సైనికుల లక్ష్యమన్నారు. వాటిల్లో ప్రధానమైనది సామాన్యులకు కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనే తమ ధ్యమన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుల కొరకు కేటాయించిన సంక్షేమ పధకాలను కచ్చితంగా వారికి చేరే విధంగా ప్రతి జనసైనికుడు కృషి చేస్తాడన్నారు. విశాఖపట్నం

పార్లమెంటరీ స్థానం పరిధిలోని ఏడు శాసన సభ నియోజకవర్గాల్లోనూ ప్రతి గ్రామం లోని ఇల్లిల్లు తిరిగి వారికి ప్రభుత్వ పధకాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా

అందుతున్నాయా లేదా, లేని పక్షంలో అందే విధంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం మా ముందున్న లక్ష్యమన్నారు. 
కార్మిక నేతగా సిపిఐ పార్టీకి  50 సంవత్సరాలకు పైగా

సేవలందించిన ప్రముఖ కార్మిక నేత వివి రామారావు ఇటీవలే జన సేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను కలిసి ఆయనతో కలిసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో కార్మికలోకం  à°¤à±‹ అనుబంధం ఉన్న ఆయన కూడా à°ˆ కార్యక్రమానికి హాజరయ్యారన్నారు. ప్రముఖ విద్యా వేత్త, యుపిఎస్సి బోర్డు సభ్యులు, మాజీ విసి

డాక్టర్ కె ఎస్ చలం జనసేనలో కలిసి పనిచేశారన్నారు. వారి సూచనల ప్రకారమే విశాఖ వేదికగా పవన్ కళ్యాణ్ చేపట్టిన పలు కార్యక్రమాల ఫలితంగానే బృహత్తర కార్యాచరణ

చేపట్టారన్నారు. విశాఖ ప్రాంతంతో జనసేనాని అనిర్వచనీయమైన అనుబంధం ఉందన్నారు.  

ఈ సమావేశం లో ప్రాంతీయ కార్యదర్శి గా మాజీ కార్పొరేటర్, కార్మిక నేత కోన

తాతారావు మాట్లాడుతూ ఇల్లిల్లు తిరుగుతూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్న కార్యక్రమమే ప్రజా చైతన్యం అని, దీన్ని ఇప్పడికే ప్రతి వార్డు స్థాయిలోనూ దిగివిజయంగా

కొనసాగిస్తున్నామన్నారు. à°µà±à°¯à°µà°¸à±à°¥à°¾à°ªà°• నియామకాల్లో భాగంగా విశాఖ పట్నం పార్లమెంటరీ కమిటీలు, అధ్యక్ష్య కార్యదర్శులు, కమిటీ సభ్యులు  à°­à°¾à°¦à±à°¯à°¤à°²à± చేపట్టారు.

 

విశాఖ పార్లమెంటరీ కమిటీ సభ్యులు వీరే :

ప్రాంతీయ కార్యదర్శి గా మాజీ కార్పొరేటర్, కార్మిక నేత కోన తాతారావు, కార్యదర్శి గా పారిశ్రామిక వేత్త

బొలిశెట్టి సత్య, కార్య నిర్వాహక కార్యదర్శులుగా ఎం. రాఘవరావు, ఆలివర్ రాయ్, బొగ్గు శ్రీనివాసరావు, తిప్పల రమణారెడ్డి, గడసాల అప్పారావు, వైస్ చైర్మన్ గా పి వి శివ

ప్రసాద్ రెడ్డి, కోశాధికారిగా తోట సత్యనారాయణ, అధికార ప్రతినిధులుగా యు. ప్రవీణ్ బాబు, సి. ముసలయ్య లను నియమించారు. సిటిజన్ కౌన్సిల్స్ కి నండూరి రామకృష్ణ, లీగల్

విభాగానికి వై. మార్కండేయులు చోటు దక్కించుకొనగా కార్యవర్గ సభ్యులుగా బొండపల్లి దేవి, సురవరపు రామన్ సుబ్బారావు, కల్ల మణిప్రసాద్, మాధవి విజయ దుర్గ బండి, నక్క

రమణారావు, పివిఎన్ రావు, మల్లువలస శ్రీను, మొక సత్యనారాయణ, వాసుపల్లి నరేష్, గుంటూరు లక్ష్మి నరసింహ మూర్తి, ఈవూరి విజయ రామరాజు, సభ్యులుగా ఫ్యూచర్ లీడర్స్ గా

సేవలందిందిస్తున్న కఠారి జ్యోత్స్నా సహా 17 మందిని నియమించారు. వీరంతా శనివారం భాద్యతను చేపట్టారు. 

 

 

#dns live  #dns  #dnslive  #dns news  #dns media  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #janasena  #pavan kalyan  #bolisetty satyanarayana  #kona tatarao  #balaraju
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam