DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శిశు మందిర్ లో వైభవంగా వసంత పంచమి వేడుకలు 

విద్యార్థులే ఋత్విక్కులుగా సరస్వతి హోమం 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 10, 2019 (DNS Online) : మాఘ శుద్ధ పంచమి, వసంత పంచమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ నగరం లోని

లలితానగర్ లో గల శ్రీకృష్ణ విద్య మందిర్ (శిశు వాటిక) లో అత్యంత వైభవంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. వసంత పంచమి వేడుకలను ఆగమ విధానం ప్రకారం

సరస్వతి హోమం తో ప్రారంభించారు. శ్రీ కృష్ణ విద్యా మందిర్ లోని విద్యార్థులే ఋత్విక్కులుగా ఈ సరస్వతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సరస్వతి మాత మూల మంత్రం

తో హవనం చేశారు. అనంతరం ఋత్విక్కులతో కలిసి శ్రీ కృష్ణ విద్యా మందిర్ సంస్థ కరస్పాండెంట్ రామచంద్ర రాజు  à°—ాయత్రీ మంత్రం హవనం చేపట్టారు. à°ˆ సందర్బంగా రామచంద్ర

రాజు మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా తమ విద్యా సంస్థలో ప్రతి సంవత్సరం వసంత పంచమి పర్వదినోత్సవం రోజున మూడు సంవత్సరాల లోపు చిన్నారులకు ఉచితంగా అక్షరాభ్యాస

కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలియచేసారు. విద్యా ప్రదాత అయిన సరస్వతి మాత అనుగ్రహం అందరికీ లభించాలని, ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానునికి వేడుకుంటూ,

చిన్నారులు, వారి తల్లిదండ్రులచే సరస్వతి పూజ చేయించి, విశేషంగా మంత్రం జపం చేయించి, విద్యా విధానం, విద్యార్థి కి ఉండవలసిన లక్షణాలు, తల్లిదండ్రులు, అధ్యాపకులు,

పెద్దలను ఏ విధంగా గౌరవించాలో తెలియచేసారు. ప్రతి వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ అత్యంత విలువైనదని, అత్యంత ప్రాశస్త్యమైనదని, ఈ స్థాయి నుంచే విద్యార్థులకు

ఉన్నత విలువలను తెలియచేయాల్సిన భాద్యత ప్రతి తల్లిదండ్రులు, అధ్యాపకులపై ఉందన్నారు. పిల్లలకు తెలియచేసే ముందుగా తల్లిదండ్రులు సైతం అదే విలువలను

పాటించినట్లయితే పిల్లలు వాటినే పాటిస్తారన్నారు. ఇదే రోజున తమ సంస్థలోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాలయాల్లోను, కళాశాలలోనూ ఈ వేడుకలు

నిర్వహిస్తున్నామన్నారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ సామూహిక అక్షరాభ్యాసం సందర్బంగా సంస్థ ప్రిన్సిపాల్ వివి నాగేశ్వరి మాట్లాడుతూ అత్యంత పవిత్రమైన వసంత పంచమి

రోజున అక్షరాభ్యాసం చేయించి, అనంతరం తమ సంస్థలో విద్యార్థులకు ప్రవేశ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఈ అక్షరాభ్యాసం లో పాల్గొనే చిన్నారులు తప్పని సరిగా తమ

విద్యా సంస్థలోనే చేరాలి అనే నిబంధన లేదన్నారు. ఈ మంచి కార్యక్రమం సమాజంలోని అందరికీ అందాలి అనే లక్ష్యంతో భారతీయ విద్యా కేంద్రం సంస్థల్లో ఈ రోజున సామూహిక

అక్షరాభ్యాసం నిర్వహించడం జరుగుతుందన్నారు. 
అనంతరం అక్షరాభ్యాసం లో పాల్గొన్న చిన్నారులతో సంస్థ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, అధ్యాపకులు పలకలపై ఓం కారం,

తదుపరి అక్షరాలను దిద్దించారు.  à°¸à±à°®à°¾à°°à± 100 మందికి పైగా చిన్నారులు అక్షరాభ్యాస కార్యక్రమం లో పాల్గొన్నారు. 
ఈ కార్యక్రమం లో సంస్థ లోని అధ్యాపకులు, విద్యార్థులు

పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #bvk  #sisu mandir  #sri krishna vidya mandir #vasantha panchami  #vasanta panchami  #saraswati homam  #aksharabhyasam  #lalitha nagar
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam