DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మోడీ. . . . ఒక్క డైలాగ్ తో  వాయ్ కొట్టారు 

దేశ ప్రధాని సభకి కూడా బీజేపీ పార్టీ డబ్బే వాడాం.

టిడిపి ధర్నాలకు కాఫీ ఖర్చుకూడా ప్రజాధనమే వాడుతున్నారు. 

గుంటూరు,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 10, 2019 (DNS Online) : ఐదేళ్ల తర్వాత

ఆదివారం ఆంధ్ర పర్యటనకు గుంటూరు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తనదైన శైలిలో ఒక్క డైలాగ్ తో వాయ్ కొట్టారు. దేశ ప్రధాని హోదాలో తానూ ఆంధ్ర ప్రదేశ్ లో

నిర్వహించే బహిరంగ సభలో ఖర్చు చేసిన ప్రతి రూపాయి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ నిధులేనని నరేంద్ర మోడీ అన్నారు. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టే ప్రతి

ధర్నా, నిరసన కార్యక్రమం లో పెట్టె రూపాయి ఖర్చు రాష్ట్ర ఖజానా నుంచే పెడుతున్నారని ఎద్దేవా చేశారు. అసలే ఆర్ధికంగా అప్పుల్లో ఉందని గగ్గోలు పెట్టె చంద్రబాబు

నాయుడు తానూ చేసే వ్యర్ధపు ఖర్చులకు భాద్యత వహించడా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి పై తనకు, బీజేపీ పార్టీకి ఎంతో భాద్యత ఉందని, ఆశించిన దాని కంటే

ఎక్కువగానే ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందిస్తూనే ఉన్నామన్నారు. మాకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమే తాము ప్రధానిగా భాద్యతలు చేపట్టిన వెంటనే పోలవరం పై

పూర్తి స్థాయి ఆర్డినెన్స్ తీసుకువచ్చామన్నారు. దాన్ని కేంద్రమే పూర్తిగా భాద్యత వహించి నిర్మిస్తుందన్నారు. ఎన్నో విద్య సంస్థలను ఆంధ్రకే కేటాయించామని,

ఇచ్చిన నిధులకు లెక్కలు అడిగితె తాము బద్ద వ్యతిరేకులం అయ్యామన్నారు. అతను ఇష్టానుసారంగా ఖర్చు చేసిన వివరణ అడక్క పొతే కేంద్రం భాద్యరహిత్యమే

అవుతుందన్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #bjp  #guntur  #narendra modi  #prime minister  #andhra pradesh  #chandrababu naidu  #kanna lakshminarayana  #GVL  #TDP  #Congress  #party funds  #telugu desam
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam