DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సౌర, పవన్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో వృద్ధి : ఏపిఇపిడిసిఎల్‌ సిఎండి హెచ్‌.వై దొర

సౌర, పవన్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో వృద్ధి
ఏపిఇపిడిసిఎల్‌ సిఎండి హెచ్‌.వై దొర
విశాఖపట్నం, మే 11 2018 (డిఎన్‌ఎస్‌) : సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తిలో రాష్ట్రం ఎంతో వృద్ధి

సాధించిందని ఏపిఇపిడిసిఎల్‌ సిఎండి హెచ్‌.వై దొర అన్నారు. శుక్రవారం ఉదయం ఏయూ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో నిర్వహిస్తున్న మూడు రోజుల ప్రత్యేక శిక్షణ

కార్యక్రమం ‘ కన్వర్టర్స్‌ అండ్‌ కంట్రోర్స్‌ ఆఫ్‌ ఫోటో వోల్టిక్‌ సిస్టం’ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ 2020 నాటికి పదివేల మెగా వాట్‌ సౌర విద్యుత్‌ను

ఉత్పత్తి చేయడం లక్ష్యంగా రాష్ట్ర పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4 వేల మెగా వాట్‌ సౌర, మరో నాలుగు వేల మెగావాట్‌ పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం

జరుగుతోందన్నారు. నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు à°’à°• మెగావాట్‌ సౌర విద్యుత్‌ ఉత్పత్తి వ్యవస్థ నిర్మాణానికి రూ 7 కోట్లు వరకు ఖర్చుఅయ్యేదని, కేంద్ర, రాష్ట్ర

ప్రభుత్వాల చొరవతో నేడు కేవలం  4 కోట్లతో à°ˆ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరుగుతోందన్నారు. సౌర విద్యుత్‌ రంగంలో ఎంతో ప్రగతి, అభివృద్ధిని రాష్ట్రం

సాధిస్తోందన్నారు. మరింత బలం , సుస్థిరత సాధించే దిశగా శిక్షన ఉపకరిస్తుందన్నారు.

వర్సిటీ రిజిస్ట్రార్‌ వి.ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ విద్యుత్‌ ఉత్పత్తి

రంగంలో స్వయం సంవృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. నేడు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించడం జరుగుతోందన్నారు. నాణ్యమైన నిరంతర విద్యుత్‌ను అందించే

దిశగా రాష్ట్రం పూర్తిస్థాయిలో సిద్దం కావాల్సి ఉందన్నారు. వర్సిటీలో ఏర్పాటు చేస్తున్న సీమెన్స్‌ కేంద్రం విభిన్న నైపుణ్యాను అభివృద్ధి చేయడం

వీలవుతుందన్నారు.

ఇంజనీరింగ్‌ కళాశా ప్రిన్సిపాల్‌ ఆచార్య పి.ఎస్‌ అవధాని మాట్లాడుతూ సృజనాత్మకంగా పనిచేసే యువతకు ఆవిష్కరణ వేదికగా ఇటువంటి సదస్సు

నిలుస్తాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇన్నోవేషన్‌సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఐఐటి దిల్లీ ఆచార్యు సుకుమార్‌ మిశ్రా మాట్లాడుతూ

విభిన్నదేశాను ఇంధన వనరుల ఆధారితంగా అనుసంధానం చేయాన్నారు. దీని ఫలితంగా దేశాల మధ్య వివాదాలు తగ్గిపోతాయన్నారు.  à°¸à±Œà°° విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో భవిష్యత్తులో

భారత్‌ ఎంతో ప్రగతి సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి ఆచార్య కె.వైశాఖ్‌, సదస్సు కన్వీనర్‌ ఆచార్య కె.పద్మ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో వివిధ

రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam