DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రూ. 2200 కోట్ల తో విశాఖలో గోల్డ్ ప్లస్ గాజు పరిశ్రమ, ఏపీఈడీబీ తో ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక అభివృద్ధి బోర్డు తో ఒప్పంద సంతకాలు 

విజయవాడ, ఫిబ్రవరి 14, 2019 (DNS Online): ప్రముఖ గాజు గ్లాసు ఉత్పత్తి సంస్థ గోల్డ్ ప్లస్ సంస్థ రూ. 2200 కోట్ల

పెట్టుబడులతో విశాఖ లో భారీ పరిశ్రమ నెలకొల్పేందుకు ఆంధ్రా ప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం  à°•à±à°¦à±à°°à±à°šà±à°•à±à°‚ది. మరో మూడు నాలుగేళ్లలో సంస్థ పూర్తిస్థాయి కార్యాచరణ

ప్రారంభించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక అభివృద్ధి బోర్డు  ( ఏపీఈడీబీ ) సీఈఓ జె. కృష్ణ కిషోర్  DNS కు తెలిపారు. మంగళవారం రాజధాని అమరావతి లో మంగళవారం జరిగిన

ఒప్పంద సమావేశం లో సంస్థ ప్రతినిధులతో ఒప్పందం జరిగినట్టు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో భవన నిర్మాణ రంగం లో ఉత్పత్తుల రంగంలో పెట్టుబడులు

పెట్టేందుకు అత్యంత అనువైనదన్నారు. ప్రధానంగా ఆంధ్రుల కలల రాజధాని అమరావతి, 14 స్మార్ట్ సిటీలు, 3 మెగా సిటీలు, విమానాశ్రయాలు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్ తదితర

నిర్మాణంలో ఇటువంటి ఉత్పత్తుల వినియోగం అధికంగా ఉంటుందని తెలిపారు. ప్రఖ్యాత గ్లాసు ఉత్పత్తి సంస్థలైన సెయింట్ గోబియాన్, యు ఎస్ జి బోరల్, లిక్సిల్, తదితర సంస్థల

నుంచి దరఖాస్తులు వస్తున్నట్టు తెలిపారు. 

ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక అభివృద్ధి బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి జె. కృష్ణ కిషోర్, గోల్డ్ ప్లస్ సంస్థ

ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ జిమ్మీ త్యాగి లు ఒప్పందం పై సంతకాలు చేసారు.  

గోల్డ్ ప్లస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ జిమ్మీ త్యాగి  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ విశాఖపట్నం

కేంద్రంగా తమ సంస్థ కార్యాచరణ ప్రారంభించనుందని  à°‡à°ªà±à°ªà°¡à°¿à°•à±‡ ఉత్తరాఖండ్ లోని రూర్కీ లోను, హర్యానా లోని సోనేపట్, హిమాచల్ ప్రదేశ్ లోని కాల అంబు లో తన ఉత్పత్తులను

అందిస్తోందని తెలియచేసారు. పూర్తి స్థాయి భారతీయ సాంకేతిక విధానంతో, అత్యంత వేగవంతమైన ప్రాజెక్ట్ ను అందిస్తోందని తెలిపారు. రూర్కీ లోని ప్లాంట్ ఏడాదికి 4, 27 000

మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను తయారుచేస్తోందని వివరించారు. 

ప్రస్తుతం విశాఖ లో నిర్మించనున్న ప్లాంట్ రాష్ట్ర అభివృద్ధి లో కీలక పాత్ర పోషిస్తూ,  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤

అవసరాలకు అనుగుణంగా, తక్కువ సమయంలో మెరుగైన ఉత్పత్తులను సిద్ధం చెయ్యనుందన్నారు. ప్రత్యక్షంగా 1500 మందికి, పరోక్షంగా 12 వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ విధమైన

ఉత్పత్తుల తయారీ అత్యంత క్లిష్టమైనదన్నారు. ప్రస్తుతం భారత దేశం లో కేవలం ఐదు ప్లాంట్ లు మాత్రమే à°ˆ విధమైన గాజు ఉత్పత్తులను అందిస్తోందన్నారు. à°ˆ సంస్థ ద్వారా ఏటా 73

వేల మెట్రిక్ టన్నుల గ్లాస్ ఉత్పత్తులు అందించనుంది. ప్రత్యక్షంగా 1500 మందికి, పరోక్షంగా 12 వేల మందికి ఉపాధి లభించనుంది.    

ఈ సమావేశం లో ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక

అభివృద్ధి బోర్డు ఉపాధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి ఎస్పీ టక్కర్ తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #Gold Plus  #Float Glass factory  #Amaravati  #APEDB

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam