DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గల్లీ నేతల పాటి కూడా జాతీయ నేతలు చెయ్యలేదా ?

సొంతంగానే గోతులు తీసుకుంటున్న బీజేపీ నేతలు 

జివిఎల్ ప్రెస్ మీట్ లో మీడియా లేదు, 

రామ్ మాధవ్ మీటింగ్ సభ్యులు లేరు: 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 15, 2019 (DNS

Online): భారతీయ జనతా పార్టీ లో అంతర్గత కుమ్ములాటలు విశాఖ నగరం వేదికగా బయట పడ్డాయి.  à°—ల్లీ స్థాయి నేతలు పెట్టె సమావేశానికి నగరం తో సహా, మొత్తం విశాఖ జిల్లా మీడియా

వారికీ పలు మార్లు సోషల్ మీడియా లో ఆహ్వానం పలకడం తెలిసిన బీజేపీ నేతలకు ఢిల్లీ నేతలు విశాఖ పర్యటనకు వస్తే వీళ్ళు మొహం చాటేయడం వెనక పార్టీ నేతల అంతర్గత

కుమ్ములాట కారణంగా కనపడుతోంది. 
గురువారం నగరానికి వచ్చిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, అతని వెంట వచ్చిన ఎంపీ జివిఎల్ నర్శింహారావు లు

నిర్వహించిన సమావేశానికి పార్టీ జనాన్ని కూడా తీసుకు రాలేని దుస్థితిలో నగర బీజేపీ కమిటీ ఉందని తేలిపోయింది. నగరం లోని ఓ హోటల్ లో ప్రజా సమస్యలను

తెలుసుకునేందుకు నిర్వహించిన ప్రజా సదస్సుకు కనీసం పార్టీ సభ్యులు కూడా హాజరుకాక పోవడం జాతీయ నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. కనీసం రెండు వరుసలు కూడా

నిండకపోవడంతో ఎప్పడికప్పుడు హడావిడిగా ముఖ పరిచయస్తులను బ్రతిమాలుకుని సమావేశానికి తీసుకు వచ్చిన పరిస్థితి నెలకొందని బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రతినిధులే DNS కు

చెప్పడం గమనార్హం. 

రామ్ మాధవ్ ఎన్నికను వ్యతిరేకిస్తున్న వర్గం ఈ సమావేశాన్ని అట్టర్ ఫ్లాప్ చేసేందుకు చేసిన కృషి ఫలించినట్టుగానే తెలుస్తోంది. సంఘ్

పరివార్ లో చురుకుగా పనిచేసిన రామ్ మాధవ్ రాజకీయాల్లో సైతం సూటిగానే ఉండడంతో ఆంధ్రా నేతలకు కొందరికి మింగుడు పడక, సమావేశానికి హాజరు కావాల్సిన వారిని రాకుండా

చేసినట్టు తెలుస్తోంది. 
అదే విధంగా అనంతరం నిర్వహించిన ఎంపీ జివిఎల్ నర్శింహారావు నిర్వహించిన విలేకరుల సమావేశం లో పాల్గొనవలసి మీడియా సంస్థలకు సైతం

సమాచారం అందకుండా చెయ్యడంలో వ్యతిరేక వర్గం కృతకృత్యులయ్యింది. ప్రెస్ మీట్ à°•à°¿ మీడియా రాకపోవడంతో పార్టీ నేతలనే కూర్చోబెట్టి తూతూ మనిపించారు.  
 à°¡à°¿à°œà°¿à°Ÿà°²à±

మీడియా ని  à°µà°¿à°¸à±à°¤à±ƒà°¤à°‚à°—à°¾ ప్రచారం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్న బీజేపీ లోనే రాష్ట్ర కమిటీ, నగర బీజేపీ కమిటీలకు సోషల్ మీడియా ను వినియోగించుకోవడం

చేతకాదు అంటే వాళ్ళ డొల్లతనం బయట పడుతోంది. వీళ్ళ పార్టీ వాళ్ళకే మొబైల్ ఫోన్ వాడడం సరిగ్గా రాక పొతే, వీళ్ళు ప్రజలకేమి చెప్తారో మరి. 

ప్రపంచంలోనే అతి పెద్ద

ప్రజాస్వామ్య సంస్థ కల్గిన భారత దేశాన్ని పరిపాలిస్తున్న అధికార పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విశాఖ నగరానికి వస్తే. . . దానికి తగినంత మైలేజ్ కల్పించడం లో

ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ కమిటీ గాని, విశాఖ నగర కమిటీ గాని ఉపయోగించుకోలేక పోయింది అన్నది అక్షర సత్యం. మీడియా సహా, అభిమానులు, మేధావులు, విద్యా వేత్తలు, సంఘ్ పరివార్,

సహా వివిధ వర్గాల ప్రజలు రామ్ మాధవ్ వాణిని వినడానికి వేలాది మంది నెలల తరబడి ఎదురు చూస్తూ ఉంటె. . ఆయన రాకను తెలియచేయడం లో ఆంధ్ర బీజేపీ ఘోరంగా విఫలం చెందింది. దీని

ఫలితం రానున్నఎన్నికలలో బీజేపీ ఘోర పరాభవానికి మార్గ సుగమం చేస్తుంది అనడం అవాస్తవం కాదు. ఇదే సదస్సులో పాల్గొన్న బీజేపీ ఫైర్ బ్రాండ్ జివిఎల్ నరసింహారావు

మీడియా సమావేశం నిర్వహించారట. ఈ సమాచారాన్నిస్థానిక మీడియా ప్రతినిధులకు తెలియచేయడం లో బీజేపీ మీడియా కమిటీ చతికిల పడిపోయింది. దేశం లో ఎన్నో సాంకేతిక

విప్లవాలు సృష్టించిన ఘనత కల్గిన బీజేపీ నేతలకే వాటిని సద్వినియోగం చెయ్యడం చేతకాలేదంటే మరి వీళ్ళు ప్రజల్లో వాటిని ఎలా ప్రచారం చేస్తున్నారో ?

 

 

 

#dns  #dns

live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #bjp  #viswanadha raju  #visakhapatnam  #vizag   #GVL Narasimha Rao  #Ram Madhav

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam