DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ జోన్ ఇవ్వాల్సిందే తప్పదు, రైల్వే మంత్రి తో ఎమ్మెల్యే విష్ణు 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 21, 2019 (DNS Online ): విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చి తీరాల్సిందేనని బీజేపీ శాసన సభ పక్ష నేత విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణు కుమార్

రాజు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కు సూచనాపూర్వక హెచ్చరికలు చేశారు. గురువారం నెల్లూరు పర్యటనకు వచినా కేంద్ర మంత్రిని కలిసిన విష్ణుకుమార్ రాజు రైల్వే

జోన్ ఏర్పాటు ఆవశ్యకతను తెలిపారు. గత ఎన్నికల్లో విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చిందని, దాన్ని నాటి ప్రధాన

మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ బహిరంగంగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇదే హామీతోనే కోట్లాది మంది ఆంధ్రా ప్రజలు ఇటు ఆంధ్రాలోనూ, అటు కేంద్రం లోనూ బీజేపీ కి,

నాటి అనుబంధ టీడీపీ కి ఓటు వేసి పార్టీకి మద్దతు ఇచ్చారని, వాళ్ళ నమ్మకాన్ని తుంగలోకి తొక్కడం సభ్యత కాదన్నారు. ఇకపై బీజేపీ ని నమ్మే స్థితి ఆంధ్ర ప్రదేశ్ లో

లేదన్నారు. ఇంతవరకూ పార్టీ ఆంధ్రా ను రైల్వే జోన్ విషయం లో మోసగిస్తూనే వచ్చిందని, ఇక ఇలాంటి ఆటలు సాగవన్నారు. ఇప్పడికే చాలామంది కరుడుకట్టిన బీజేపీ నేతలు,

ఎమ్మెల్యే లు పార్టీని వీడి వేరే పార్టీల్లో కి వెళ్లిపోయారన్నారు. మిగిలినవాళ్లు కూడా వెళ్ళిపోడానికి సిద్ధంగా ఉన్నారని, రైల్వే జోన్ ఇవ్వని పక్షంలో తనకు

కూడా మరో గత్యంతరం లేదని హెచ్చరించినట్టుగా సూచించారు. ఇప్పటికే చాలా సార్లు గుర్తు చేశా. మరోసారి కూడా ఇచ్చిన హామీని  à°¨à±†à°°à°µà±‡à°°à±à°šà°¾à°²à°¨à°¿ చెబుతున్నానని

తెలిపారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #railway zone  #vishnu kumar raju  #visakhapatnam north  #piyush goyal  #railway minister  #Nellore
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam