DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలంలో వీళ్ళు అర్చకులా ? లేక రికార్డ్ అసిస్టెంట్ లా?

వీళ్ళు లెక్కల్లో లేరా? ఉంటే ఎస్ ఆర్ లో పేర్లు లేవేంటి? : 

ఈఓ à°•à°¿ ఖాళీ లేదు, స్టాఫ్ à°•à°¿ తీరిక లేదు, వీళ్ళకి ఓపిక లేదు. 

విశాఖపట్నం, ఫిబ్రవరి 22, 2019 (DNS Online): ప్రముఖ

శ్రీవైష్ణవ దివ్యక్షేత్రం సింహాచలం దేవాలయంలో సుమారు 16 మంది అర్చకులు ఆలయ నియమ నిబంధనల ప్రకారం గత 2 ఏళ్ల 3 నెలల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. వీరిని

అధికారికంగా విధుల్లో తీసుకున్నప్పటికీ ఒక లెక్క పత్రం లేకుండా ఊడిగం చేయిస్తున్నట్టు తెలుస్తోంది. వీరిని 2016 లో విధుల్లోకి తీసుకున్న నాటి నుంచి సర్వీస్

రిజిస్టర్ లో వీరి వివరాలను నమోదు చేయించాల్సి యుండగా ఆలయ కార్యాలయ సిబ్బంది కి అధికారిక ఉత్తర్వులు ఇవ్వాల్సిన ఆలయ కార్యనిర్వహణాధికారి కి క్షణం తీరిక లేదు ట.

ఈయనకి  à°…ధికారులకు పాదాక్రాంతులవ్వడం లోనే సమయం చాలడం లేదని ఆలయ సిబ్బందే తెలియచేస్తున్నారు. ఈయన ఆదేశాలు ఇస్తే తప్ప ఆలయ కార్యాలయ సిబ్బంది సర్వీస్ రిజిస్టర్

లో ఈ 16 మంది అర్చకులా పేర్లు నమోదు చెయ్యరు, పేర్లు నమోదు చెయ్యక పొతే వీళ్లంతా ఆలయ స్టాఫ్ గా గుర్తింపు పొందారు. పైగా రెండేళ్ల కాలం క్షణం తీరిక లేకుండా ఆలయ ఈఓ

 à°…ధికార పార్టీ ప్రతినిధుల అడుగులకు మడుగులొత్తడానికే 24 à°—à°‚à°Ÿà°² సమయం చాలడం లేదుట. ఇక అర్చకులను పట్టించుకునే సమయం ఎక్కడిది? ఇంతకీ à°ˆ అర్చకులు ఎవరు?  à°µà±€à°°à± ఎక్కడ

విధులు నిర్వహిస్తున్నారు ? రెండేళ్ల క్రితం అధికారికంగా విధుల్లోకి తీసుకున్న వీరికి తగిన శిక్షణ సమయం ( నిబంధనల ప్రకారం) వీరికి సర్వీసు ను క్రమబద్దీకరిస్తూ

సర్వీసు రిజిస్టర్ లో పేర్లు నమోదు చెయ్యవలసి యుంది. అయితే నేటికీ వారు త్రిశంఖు స్వర్గంలోని ఉన్నారు. వీరందరికీ రికార్డు అసిస్టెంట్ లు గా పరిగణిస్తూ రూ. 19 వేల

నుంచి రూ. 22 వెలవరకూ కాన్సలాసిడెట్ వేతనాలు ఇస్తున్నారు. వీరిని రెగ్యులర్ చెయ్యవలసి యుండగా ఈఓ పూర్తిగా నిర్లక్ష్య వైఖరి కారణంగా ( ఈయనకి అధికార సేవ కంటే ఆలయం,

అర్చకులు గోడు పట్టని పట్టదు) వీళ్ళంగా గాల్లోనే ఉండిపోయారు. వీరి తర్వాత చేరిన వారికి ఇప్పడికే రెండు ఇంక్రిమెంట్లు రాగా వీరు మాత్రం తమ పరిస్థితి ఏంటో తెలియక

ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిని సర్వీసు రిజిస్టర్ లో పేర్లు నమోదు చెయ్యక పొతే వీరంతా అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నట్టే లెక్క. అనధికారికంగా ఉన్న

వీరితో ఈఓ చేయించే పని అంతా వెట్టి చాకిరీ క్రిందే లెక్క వస్తుంది అన్నది సిబ్బంది ఆవేదన.

వీళ్ళని రెగ్యులర్ చెయ్యడానికి ఈఓ కి ఖాళీ లేదు, కార్యాలయ

సిబ్బందికి తీరిక లేదు, à°¤à°®à°•à± à°ˆ నిరంకుశ పరిస్థితి నుంచి మోక్షం ఇప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అర్చకులకు ఓపిక లేదు. 

 

 pix courtesy : to whom so ever it may concern

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam