DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రధాని మోడీ విశాఖ సభతో చరిత్ర సృష్టిస్తాం: కన్నా 

విశాఖపట్నం, ఫిబ్రవరి 22, 2019 (DNS Online): మార్చి 1 న విశాఖ లో జరుగనున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభతో చరిత్ర సృష్టిస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా

లక్ష్మీనారాయణ ప్రకటించారు. శుక్రవారం నగరంలోని న్యూకొలని లో à°—à°² రైల్వే మైదానంలోని సభ వేదిక వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  à°ˆ సభను

అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కుతంత్రాలు చేసిందని, నగరంలోని నడిబొడ్డులో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానాన్ని కూడా ఈ సభకు ఇవ్వకుండా

చంద్రబాబు అడ్డుకట్ట వేసి గెంతులు వేశారన్నారు. అయితే ప్రధాని సభ నిర్వహణకు రైల్వే మైదానాన్ని ఎంచుకున్నట్టు తెలిపారు. మార్చి 1 న సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే ఈ

సభకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, పార్టీ అభిమానులు, నగరవాసులు హాజరు కానున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర కమిటీల

నేతలు, భారీ సంఖ్యలో హాజరుకానున్న ఈ సభను దిగ్విజయంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. మైదానం లోని సభ వేదిక ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ప్రధాన సభ వేదిక, కుర్చీల

ఏర్పాటు, కార్యకర్తలు, నగర ప్రజలు, తదితరులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సభను వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశం లో బీజేపీ శాసన సభ

పక్ష నేత,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ఉత్తర నియోజకవర్గం శాసన సభ్యులు పి. విష్ణుకుమార్ రాజు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, నగర అధ్యక్షులు à°Žà°‚. నాగేంద్ర,

తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #telugudesam  #kanna lakshminarayana   #narendra modi  #railway grounds  #ew colony  #public meeting
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam