DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎయు గ్రౌండ్ ఇవ్వక పోవడం రాష్ట్రానికే సిగ్గు చేటు : ఎమ్మెల్యే విష్ణు 

ఏయూకు వచ్చే నిధులన్నీ కేంద్రానివే, కృతజ్ఞత లేదు 

తమ్ముళ్లు తిమింగలాలే, రాష్ట్రాన్ని దోచేశారు

విశాఖపట్నం, ఫిబ్రవరి 22, 2019 (DNS Online) : ప్రధాన మంత్రి నరేంద్ర

మోడీ సభకి ఆంధ్ర యూనివర్సిటీ మైదానం ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని, దీనికి నానా గడ్డి కరిచి, చేయకూడని కుతంత్రాలన్నీ చేశారని బీజేపీ ఎమ్మెల్యే

విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. మార్చి 1 న విశాఖ లో జరిగే మోడీ సభ కు వేదిక ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తో కలిసి

రైల్వే మైదానానికి వచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ ప్రతినిధులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ అధీనం

లోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, శాస్త్ర సాంకేతిక విభాగం  à°¨à±à°‚à°šà°¿ వచ్చే నిధులతో ఎయు నడుస్తోందని, అలాంటిది à°ˆ దేశ ప్రధాని ప్రసంగించే బహిరంగ సభకు అనుమతి

ఇవ్వడం కుదరదు అని చెప్పడం అంటే ఈ రాష్ట్రానికే అవమానం అన్నారు. కేవలం తెలుగుదేశం తొత్తులుగా పనిచేస్తూ కేవలం తెలుగుదేశం నిర్వహించే మహానాడు, టిడిపి ఎంపీలు,

ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యుల పెళ్లిళ్లు పేరంటాళ్ళు, తాగుబోతుల సైయ్యాటలకు మాత్రమే ఎయు మైదానాలు ఇవ్వాలని అధికార పార్టీ ఆదేశాలు ఇచ్చిఉంటుందని, అందుకే

కేవలం టిడిపి పనులకు మాత్రమే ఎయు మైదానాలు ఇస్తున్నారన్నారు. టిడిపి ప్రజాప్రతినిధులు, జన్మభూమి కమిటీలు పూర్తిగా అవినీతి లో కూరుకు పోయాయని, కోట్లాది రూపాయలు

దోచుకున్నారని మండిపడ్డారు. ఇదంతా రాష్ట్ర ప్రజలదేనన్నారు. ఇదే రీతిలో ఈ రాష్ట్రం లో తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు చేస్తున్న దోపిడీలను రాష్ట్ర ప్రజలు

గమనిస్తున్నారని, ఈ క్రమం లోనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వెయ్యరనే నమ్మకంతోనే రాష్ట్రాన్ని మరింతగా దోచుకు తింటున్నారన్నారు. మహిళలకు పసుపు కుంకుమ పేరుతొ

ఒక్కొక్కరికి రూ.10 వెలు ఇస్తున్నారని, దీనికి మొత్తం పది వేలకోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ఇదంతా చంద్రబాబు తల్లిదండ్రులు ఇచ్చిందా, లేక వాళ్ళ మావగారు ఇచ్చిన

జాగీరా. ఇదంతా ప్రజల సొమ్మే అన్నారు.  à°‡à°¦à±‡ డబ్బుతో ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీ కరిస్తే ఇదే మహిళల ఆరోగ్యానికి మెరుగైన పరిరక్షణ

జరుగుతుందన్నారు. ఈ డబ్బులు కూడా రెండు చిక్కులే ఉపయోగపడతాయని, మూడో చెక్కు ఎన్నికలు జరిగిన తర్వాత విడుదల అవుతుందని, ఒకవేళ ఎన్నికల్లో టిడిపి కి ఓటు వేస్తెనే

ఇది ఇస్తారన్నారు. ఇదంతా ప్రజల డబ్బుతో తెలుగుదేశం పార్టీ ఓట్లు కొనుక్కుంటోందన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #telugudesam  #kanna lakshminarayana   #narendra modi  #railway grounds  #ew colony  #public meeting  #MP  #MLA 

#MLC

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam