DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సైనిక కుటుంబాలకు 2BR ఇళ్ళు కట్టిస్తాం : క్రెడాయ్ 

విశాఖపట్నం, ఫిబ్రవరి 22, 2019 (DNS Online) : ఇటీవల ఉగ్రవాదుల దాడులకు బలైన అమరవీరుల కుటుంబ సభ్యులకు వారు కోరుకున్న ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టి ఇవ్వనున్నట్టు

క్రెడాయ్ విశాఖపట్నం శాఖా చైర్మన్ జివివిఎస్ నారాయణ తెలిపారు. శనివారం నగరం లోని ఓ హోటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ వందల కోట్లాది

భారతీయుల పరిరక్షణలో అశువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు అండగా నిలబడవలసిన అవసరం ఉందన్నారు. వారి కుటుంబ సభ్యులు కోరుకున్న ప్రాంతంలో ఒక డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు

కట్టి సైనికుల తల్లి, భార్య పేరిట సంయుక్త రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. ఈ మేరకు క్రెడాయ్ జాతీయ కమిటీ భారత ప్రధాని నరేంద్ర మోడీ కి ఈ సమాచారాన్ని అందించినట్టు

తెలిపారు. 
తమ వ్యాపారానికి గండి కొట్టే విధంగా ప్రతి ఏడాది సిమెంట్ ధరలు విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారని, తమకు వ్యాపారం సానుకూలం గా చేసుకునే పరిస్థితి

లేకుండా పోతోందన్నారు. రాష్ట్రం లో విద్యుత్ కోతలు లేనప్పటికీ, సిమెంట్ పరిశ్రమల సిబ్బందికి ఆర్ధిక భారం లేక పోయినా సరే ప్రతి ఏడాది సిమెంట్ ధరలు

పెంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కొందరు వ్యాపారుల పై కేసులు కూడా  à°¨à°®à±‹à°¦à± చేసినట్టు కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయన్నారు. à°ˆ సిమెంట్ ధరలను

నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. à°ˆ విలేకరుల సమావేశం లో విశాఖపట్నం శాఖ అధ్యక్షులు  à°ªà°¿ కోటేశ్వర రావు, కార్యదర్శి కె ఎస్ ఆర్ కె రాజు (సాయి) తదితరులు

పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #credai   #pulvama  #martyrs   #military  #double bed room

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam