DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాద్రి నాధునికి శ్రీనివాసుని స్వర్ణ పుష్ప కైంకర్యం 

విశాఖపట్నం, ఫిబ్రవరి 25, 2019 (DNS Online) : ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామికి జాతీయ పాత్రికేయ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు స్వర్ణ పుష్ప

కైంకర్యం చేసారు. సింహాచలం క్షేత్రం లో స్వామికి అపురూప కైంకర్యం చేసేందుకు భక్తుల నుంచి స్వర్ణ పుష్ప దళ సేకరణ నిమిత్తం విరాళాలకై ఆలయ సిబ్బంది ఇచ్చిన పిలుపు

ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక పిలుపుకు స్పందనగా గంట్ల శ్రీనుబాబు, ఆయన మిత్రులు ఎస్ ఎన్ ఆర్ అధినేత బివి కృష్ణ రెడ్డి చెరో రూ. 1 28,000 రూపాయలు చెక్ రూపంలో సింహాచలం ఆలయ

అధికారులకు అందించారు. సోమవారం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించిన వీరు ఈ చెక్ లను ఆలయ అధికారులకు అందించారు. అనంతరం ఆలయ వేదపండితులు

వీరందరికీ వేదాశీస్సులను అందించారు. స్వామికి ఏటా ఒక ప్రత్యేక సేవను అందించాలి అనే సంకల్పంతో ఈ ఏడాది స్వర్ణ పుష్ప అలంకార కైంకర్య సేవకు శ్రీకారం చుట్టారు.

అంతకు ముందు కప్పస్తంభం వద్ద స్వామిని వేడుకుని అంతరాలయం దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా

ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ సంప్రదాయాన్నితర్వాత తరాలకు తెలియచేయాల్సిన భాద్యత పెద్దలపై ఉందన్నారు. ఆలయ దర్శనం, ఆధ్యాత్మిక చింతన తోనే ఎన్నో

సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. తనకు à°—à°¤ ఆరు సంవత్సరాలుగా  à°¶à±à°°à±€ వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజరూప దర్శన సేవలో అవకాశం కల్పించిన స్వామిని ఋణపడియున్నానని

తెలిపారు. తన పిలుపు మేరకు స్పందించిన మిత్రులు కృష్ణారెడ్డి à°•à°¿ ధన్యవాదాలు తెలియచేసారు. వీరిరువురిని ఆలయ సిబ్బంది అభినందనలు తెలియచేసారు. 

 

#dns  #dns live  #dns media  #dns news 

#dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #simhachalam  #temple  #gantla srinu babu  #golden flower  #simhagiri
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam