DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాప్ లో  ఏర్పడింది సమన్వయ లోపమే: ఐ జె యు నేత  ఉప్పల్ లక్ష్మణ్.

విశాఖపట్నం, మే, 12, 2018 (DNS Online) :   జర్నలిస్ట్ స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ( జాప్ ) కమిటీల్లో ఉన్నది కేవలం సమన్వయ లోపమేనని జాతీయ పాత్రికేయ సంఘం నేత ఉప్పల్ లక్ష్మణ్

వెల్లడించారు. శనివారం విశాఖపట్నం లోని వి జె ఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా జాప్ సంఘాల్లో రాష్ట్ర

వ్యాప్తం గా స్తబ్దత నెలకొందని, కేవలం ఒకరిద్దరు తమ హవా కొనసాగించేందుకు చేసిన పధకం లో భాగం గానే జాప్ లో చీలికలు వచ్చాయన్నారు. అయితే కొందరు సభ్యులు దీనిపై

న్యాయస్థానం ను ఆశ్రయించడం తో ఇరు వర్గాల మధ్య దూరం పెరుగుతూ వచ్చిందన్నారు. కేవలం సమన్వయ లోపం వల్ల వఛ్చిన ఈ తేడాలను తొలగించి అందరినీ ఏకత్రాటి పైకి తీసుకు

వచ్ఛే ప్రయత్నం లో భాగం గానే అన్ని జిల్లాల్లోనూ పర్యటిస్తున్నామన్నారు. గత కమిటీ ప్రధాన కార్యదర్శి యుగంధర్ రెడ్డి , అతని అనుచర బృందం తో చర్చలు జరిపేందుకు

విశాఖ నగరం రావడం జరిగిందని, అయితే వారు సుముఖత వ్యక్తం చేయక పోగా న్యాయ స్థానం పేరిట భయపెట్టే ప్రయత్నం కూడా జరిగిందన్నారు. దీంతో జరిగిన ఘటనలను పాత్రికేయులకు

వివరించేందుకు ఈ సమావేశం నిర్వహించామన్నారు. తాము వ్యక్తిగతం గా ఎటువంటి ఆరోపణలు చెయ్యడం లేదని, గత కమిటీ లోని సభ్యులు ఎవరెవరు ఎక్కడెక్కడ నిర్వాకాలు చేశారో,

ఎక్కడెక్కడ నిధులు వసూలు చేసి తమ వ్యక్తిగత వ్యాపారాలు చేస్తున్నారో తెలిసినప్పటికీ తాము ఎటువంటి వ్యక్తిగత ఆరోపణలూ చెయ్యడం లేదని వివరించారు. ఈ సమావేశం లో

జాప్ రాష్ట్ర అధ్యక్ష,  à°•à°¾à°°à±à°¯à°¦à°°à±à°¶à±à°²à±, విశాఖ నగర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. 

 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam