DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజు ఇది : ఎమ్మెల్యే విష్ణు 

ఉగ్రవాద శిబిరాలపై దాడికి సైన్యానికి అభినందనలు
 
విశాఖపట్నం, ఫిబ్రవరి 26, 2019 (DNS Online) : ఫిబ్రవరి 26 , 2019 రోజును ప్రతి భారతీయులు గర్వించదగ్గ రోజుగా చెప్పుకోవచ్చని బీజేపీ

శాసన సభ పక్ష నాయకులూ విష్ణుకుమార్ రాజు ప్రకటించారు. భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి భారీ సంఖ్యలో జైషే మహ్మద్

ఉగ్రవాదులని మట్టుపెట్టిన భారత వైమానిక సైన్యానికి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు శుభాకాంక్షలు తెలియచేసారు. మార్చి 1 న విశాఖ నగర

పర్యటనకు వస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ సభా ప్రాంగణం లో జరుగుతున్నా భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించడానికి మంగళవారం న్యూకోలనీ లోని రైల్వే మైదానానికి

వచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమాయక భారత సైనికులు 42 మంది ని దొంగచాటుగా దెబ్బతీసిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జె ఈ ఎం కు గట్టిగా గుణపాఠం చెప్పిన భారత

రక్షణ శాఖ, వైమానిక శాఖ, ప్రధానికి ఆయన శుభాభినందనలు తెలిపారు. ఇది తొలి అడుగు మాత్రమేనని, ఎల్లకాలం శాంతి  à°µà°šà°¨à°¾à°²à± చెపితే మాట వినే à°°à°•à°‚ కాకపోవడంతోనే పాక్ కు, దాని

అనుచర తోక బృందాలకు గుణపాఠం చెప్పడం జరిగిందన్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #mirage 2000  #IAF  #attack on Terrorists  #kashmir  #jaish e mahammad

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam