DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో వాయుసేనకు వినూత్న అభినందనలు 

విశాఖపట్నం, ఫిబ్రవరి 27, 2019 (DNS Online) : పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మమద్ శిక్షణ స్థావరాలను మట్టుబెట్టిన 12 మిరాజ్ 2000 వాయు సైనికులకు విశాఖ లో వినూత్నంగా

అభినందనలు తెలిపారు. గతంలో భారత వాయుసేన లో పనిచేసి పదవి విరమణచేసిన విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నేతృత్వంలో విశాఖపట్నం గ్రెటర్

విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ( జివిఎంసి) కార్యాలయం ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద జరిగిన జయహో భారత్ లో ఆయన వాయుసేనకు అభినందనలు తెలిపారు. భారీ బ్యానర్లలతో

ఈ 12 మంది పైలట్ ల ఫొటోలతో కూడిన హోర్డింగ్ లను మైదానం లో ఏర్పాటు చేసి వాటికి పూలమాల వేసి జయహో భారత్ నినాదాలు చేశారు. వీరి నినాదాలతో ఆ ప్రాంతమంతా

దద్దరిల్లిపోయింది. వీరి అభినందనల విధానం చూసిన నగర వాసులు సైతం జయహో నినాదాలు చేశారు. ఈ సందర్బంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత

పటిష్టమైన సైన్యం కల్గిన దేశాల్లో భారత్ నాల్గవ స్థానం లో ఉందని, దేశ భక్తి లో నెంబర్ 1 స్థానంలో ఉన్నామన్నారు. తానూ వాయుసేనలో విధులు నిర్వహించేనాటికి నేటికీ

సాంకేతిక విజ్ఞానం అసాధారణంగా పెరిగిందన్నారు. సైన్యం లో పనిచేసే ప్రతి ఒక్కరూ రెట్టించిన ఉత్సాహంతో ఉంటారని, పుల్వామా లో అమాయక సీఆర్పీఎఫ్ సానికులు 40 మందిని

పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జరిపిన దాడిలో కోల్పోయామని, దానికి ప్రతీకారంగా ఒక్కో సైనికునికి పదిమంది ఉగ్రవాదులను పైకి పంపేశారన్నారు. వారందరికీ భారీ

సెల్యూట్ చేస్తున్నట్టు తెలిపారు. తానూ ఒక్కడే సైన్యం లో పనిచెయ్యడం కాకుండా, వందలాది మంది యువకులను సైన్యంలోకి పంపేందుకు వైజాగ్ డిఫెన్స్ అకాడమీ పేరుతో

సైనిక స్కూళ్లలో ప్రవేశానికి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పడికే తమ విద్యార్థులు చాలా మంది సైన్యం లో వివిధ హోదాల్లో ఉన్నారన్నారు. 

 

#dns  #dns live 

 #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #telugudesam  #indian air force  #vasupalli ganesh kumar  #GVMC  #gandhi

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam