DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే జోన్ పై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. : ఎమ్మెల్యే విష్ణు 

à°ˆ విజయం ఉత్తరాంధ్రా వాసులదే. . . . 

విశాఖపట్నం, ఫిబ్రవరి 27, 2019 (DNS Online) : విశాఖ కేంద్రంగా రైల్వే ఏర్పాటు కై గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు

నిర్విరామంగా కృషి చేసిన అతి కొద్దీ మంది బీజేపీ నేతల్లో అగ్రగణ్యులు విష్ణు కుమార్ రాజు. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ బుధవారం చేసిన ప్రకటన అత్యంత

ఆనందాన్ని కల్గించింది అని,  
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తాం అన్నాం. . . నేడు ఇచ్చాం . ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని బీజేపీ శాసన సభ పక్ష నేత విష్ణుకుమార్

రాజు ప్రకటించారు. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చేసిన ప్రకటన ఉత్తరాంధ్ర వాసుల్లో వెయ్యి కాంతుల ఆనంద జ్యోతులను వెలిగించిందన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు

ను సానుకూలంగా చెయ్యవలసి యుండగా  à°°à°¾à°·à±à°Ÿà±à°° విభజన బిల్లులో కాంగ్రెస్ పార్టీ స్వార్ధ పూరిత నాటకాలు ఆడుతూ కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో అడ్డంకులను

కల్పించినప్పటికీ అన్నింటినీ ఛేదించి, జోన్ ప్రకటన విడుదల చేశామన్నారు. 

అధిష్టానాన్ని ఎదురొడ్డి సైతం : 
ఇచ్చిన మాటకు నిలబడేందుకు ఒకానొక పరిస్థితుల్లో

భారతీయ జనతాపార్టీ అధిష్టానం తో దాదాపుగా పోరాటం చేసినంత పనీ చేశారు. గత ఐదేళ్ల కాలంలో రైల్వే జోన్ ఇవ్వకోసం ఈయన చెయ్యని కృషి లేదంటే అతిశయోక్తి కాదు. ఒక

స్థితిలో జోన్ ఇవ్వకుంటే పార్టీని సైతం వీడ తాను అని బహిరంగ ప్రకటనే చేశారు. రాష్ట్ర కార్యవర్గం లో ఎంత చిత్తశుద్ధి ఉందొ తెలియదు కానీ, విష్ణుకుమార్ రాజు లో

సంపూర్ణ చిత్తశుద్ధి ఉంది అనడానికి ప్రధాన సాక్ష్యం కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల నెల్లూరు వచ్చిన సందర్భంలో రాజు మాట్లాడిన ఒకే ఒక్క మాట. . . విశాఖ

కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వండి అని. ఇది కూడా బహిరంగంగానే కోరడం జరిగింది.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #railway zone  #vishnu kumar raju  #visakhapatnam north  #piyush goyal  #railway minister  #Nellore

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam