DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాడు లేఖ ఇస్తే తెలంగాణ, నేడు ఇస్తే రైల్వే జోన్ 

చంద్రబాబు లేఖ à°•à°¿ ఇంత పవర్ ఉందా  ? 

విస్తృత ప్రచారం చేస్తున్న టిడిపి వర్గాలు 

విశాఖపట్నం, ఫిబ్రవరి 28, 2019 (DNS Online) : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

లేఖ వ్రాస్తే చాలా పవర్ ఉంటుందని తెలుగుదేశం నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. గతం లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చెయ్యమని మొట్టమొదటి గా తెలుగుదేశం తరపున

అంగీకారం చెప్తూ చంద్రబాబు లేఖ వ్రాయడం వల్లనే తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు ప్రకటించాయని టిడిపి వర్గాలు చెప్తున్నాయి. అదే విధంగా

మూడు దశాబ్దాలుగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కోసం లక్షలాది మంది పోరాటం చేస్తున్న అటు కాంగ్రెస్ గానీ, ఇటు బీజేపీ గానీ పట్టించుకోలేదు. అలాంటి ఒక్క రోజు

క్రితం రైల్వే జోన్ ఇమ్మని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కు చంద్రబాబు లేఖ వ్రాసారని, వెంటనే అయన రైల్వే జోన్ ప్రకటించేశారని ప్రచారం జరుగుతోంది. అంటే

ఒక్క లేఖ వ్రాస్తే ఇంత పవర్ ఉంటుంది దేశ వ్యాప్తంగా ప్రజలకు తెలిసిందన్న మాట. అయితే ఇంత ఘన కీర్తి సాధించిన తెలుగుదేశం పార్టీ నిన్నటి రోజుల రైల్వే జోన్ ఏర్పాటు

ప్రకటన వస్తే సంబరాలు ఎందుకు చెయ్యలేదో తెలియడం లేదు.

 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam