DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీవం లేని జోన్ తో ఉపయోగాలేంటి? ఉత్తరాంధ్రను ముంచొద్దు  

రైల్వే జోన్ పై హర్షం వ్యక్తం చేసిన ప్రజా సంఘాలు 

వాల్తేర్ డివిజన్ విభజన సరిగ్గా చెయ్యాలని మోడీకి వినతి 

విశాఖపట్నం, ఫిబ్రవరి 28, 2019 (DNS Online) : ఉత్తరాంధ్ర

వాసుల కల విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు. అది వచ్చింది. అయితే వాల్తేర్ డివిజన్ ను ముక్కలు చెయ్యడం వల్ల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు పూర్తిగా తూర్పు

కోస్తా రైల్వే లో ఉండిపోయి, మిగిలిన విశాఖ నగర పరిసరాలు విజయవాడ లో కలిసిపోనున్నాయి. à°ˆ క్రమం లో à°—à°¤ దశాబ్దాల కాలంగా జోన్ కోసం పోరాటం చేస్తున్న ప్రజా సంఘాలు 
/> అత్యవసర సమావేశమయ్యాయి. à°ˆ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, పాత్రికేయ, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

డివిజన్ పై స్పష్టత ఇవ్వాలి : గంట్ల

శ్రీనుబాబు 

కొత్త రైల్వే జోన్ ఏర్పాట్లు లో భాగంగా వాల్తేర్ రైల్వే డివిజన్ ను విభజిస్తున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి చేసిన ప్రకటన అందరినీ సందిగ్ధం లో

పడేసింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని పాత్రికేయ సంఘం జాతీయ కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు  à°—ంట్ల శ్రీనుబాబు తెలిపారు. ఉత్తరాంధ్ర ను రక్షించండి

మహాప్రభో అని ముప్పై ఏళ్ళ నుంచి ధర్నాలు, నిరసనలు చేస్తుంటే కేవలం విశాఖను మాత్రమే విజయవాడ డివిజన్ లో కలుపుతూ, మిగిలిన వాల్తేర్ డివిజన్ ను రాయగడకు

తరలిస్తున్నట్టు మాత్రమే మీడియా సమావేశం లో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించడాన్నిస్వాగతిస్తున్నామన్నారు. అయితే కేవలం ఏకవాక్య ప్రకటన తో

సరిపెట్టారన్నారు. 

జీవం లేని జోన్ తో ఉపయోగాలేంటి? : శివశంకర్ 

ఉత్తరాంధ్ర లేకుండా విశాఖ పట్నం రైల్వే జోన్ ఇవ్వడం అంటే  à°œà±€à°µà°‚ లేని జోన్ అని 
దీంతో

ఉపయోగాలేంటి అని ఉత్తరాంధ్ర ప్రరిరక్షణ వేదిక కన్వీనర్ ఎస్. శివశంకర్ ఎద్దేవా చేసారు. à°ˆ అసంబద్ధ విభజనతో ఇప్పడికే అన్ని రకాలుగా వెనుకబడిన  à°‰à°¤à±à°¤à°°à°¾à°‚ధ్ర

ప్రాంతాన్ని మరింత అగాధం లోకి తోసెయ్యవద్దన్నారు. 

డివిజన్ పునః సమీక్షించాలి: సిపిఐ 

సీపీఐ కు చెందిన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జెవి సత్యనారాయణ

మూర్తి మాట్లాడుతూ రైల్వే జోన్ ఏర్పాటుకు సంతృప్తి ఉన్నప్పటికీ, వాల్తేర్ డివిజన్ చెయ్యడం లో చాలా నీచ స్థాయి లో ఉందన్నారు. కేవలం ప్రయాణీకులకు సంబంధించిన

విశాఖ నగర పరిసరాలలోని రైల్వే లైన్లను విజయవాడ డివిజన్ లో కలిపి, మిగిలిన మొత్తం వాల్తేర్ డివిజన్ ను రాయగడ కు పంపడం వెనుక కేవలం బీజేపీ కి ఒరిస్సా పట్ల ఉన్న మోజే

కారణం అన్నారు. తక్షణం ఈ డివిజన్ ను విడగొట్టడం పై పునః: సమీక్ష చేసి, మొత్తం వాల్తేర్ డివిజన్ ( కేకే లైన్ తో సహా) కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో

కలపాలన్న ఉత్తరాంధ్ర వాసుల డిమాండ్లు నెరవేర్చాలి. 

పోరాటాల ఫలితమే ఈ జోన్ : సీపీఎం

ఎన్నో సంవత్సరాల పోరాటాల ఫలితమే ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు

అని భారత కమ్యూనిస్ట్ పార్టీ ( మాక్సిస్ట్) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. నర్సింగరావు, విశాఖ జిల్లా కార్యదర్శి కె. లోక నాదం, నగర కార్యదర్శి బి.

గంగారావు లు తెలిపారు. ఈ శుభవార్తను కేవలం ప్రకటన వరకే పరిమితం చెయ్యకుండా పూర్తిస్థాయిలో కార్యాచరణ చేపట్టాలన్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #railway zone  #uttarandhra 

 #rayagada  #South Coast Railway  #CPM  #CPI  #Gantla Srinubabu

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam