DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లోకేష్ మోకాలి కి దెబ్బ తగిలి మెదడు చిట్లింది : వైకాపా అమర్ 

విశాఖ రైల్వే జోన్ ప్రకటన వైకాపా పోరాట ఫలితమే 

రైల్వే జోన్ లేటు కు కారణం చంద్రబాబే 

ఇంటికి పిలిచి కప్పు కాఫీ ఇవ్వలేని పీనాసి

చంద్రబాబు 

వైఎస్ జగన్ గృహప్రవేశం చేసిన వెంటనే రైల్వే జోన్ వచ్చింది

విశాఖపట్నం, మార్చ్ 01, 2019 (DNS Online) : కేంద్రం లోని భారతీయ జనతా పార్టీ విశాఖ కేంద్రంగా

రైల్వే జోన్ ప్రకటించింది అంటే అది కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితమే నని, అనకాపల్లి వైకాపా కన్వీనర్ గుడివాడ అమర్ తెలిపారు. శుక్రవారం నగర

పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల కాలంలో మోడీ తో జతకట్టిన తెలుగుదేశం కేవలం తమ స్వార్ధ వ్యాపారాలకోసమే

సంసారం చేసిందన్నారు. విరక్తి పుట్టి విడిపోయి, ఆ నెపం వైఎస్సార్ కాంగ్రెస్ పై నెట్టిన తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరిస్థితి చూస్తుంటే అతని

మోకాలికి దెబ్బతగిలి మెదడు చిట్లిందనే అనుమానం మాకు ఉందని, తక్షణం అతని మోకాలికి వీలయితే అతని అరికాలి కూడా చికిత్స చేయిస్తే లోకేష్ మెదడు బాగుపడుతుందన్నారు.

రాష్ట్ర విభజన నాటి నుంచి ఈ రాష్ట్రం లోని తెలుగుదేశం పార్టీ, కేంద్రంలోని బీజేపీ పార్టీలు చేపడుతున్న ఆంధ్ర వ్యతిరేక నిర్ణయాలపై నిరంతరం ప్రతిఘటిస్తూ పోరాటం

చేస్తోంది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోడానికి కారణం వైఎస్ జగన్ అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యల పై

మండిపడ్డారు. 

తెలుగుదేశం మునిగిపోయే నావ  :

తెలుగుదేశం పార్టీ అనేది నడి సముద్రం లో మునిగిపోయే నా అని, దానికి కెప్టెన్ చంద్రబాబు నాయుడు అని, అతనికి

అడ్డదిడ్డంగా పుచ్చు సలహాలు ఇచ్చే సహాయకుడు అతని కొడుకు, దొడ్డిదారిన మంత్రి అయినా లోకేష్ అని అన్నారు. ఈ ఇద్దరు అసమర్దుల ఘోర వైఫల్యం కారణంగానే ఈ రాష్ట్రం

తీవ్రంగా నష్టపోయిందన్నారు. 

రైల్వే జోన్ లేటు కు టిడిపి ఏ కారణం:

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు లో లేటు జరగడానికి ప్రధాన కారణం చంద్రబాబు

నాయుడేనన్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన చీడపురుగులు ఇవేనన్నారు. గతంలో టిడిపి అధికారం లో ఉన్ననాడు టీడీపీ ఎంపీ ఎర్రన్నాయుడు పార్లమెంటరీ రైల్వే కమిటీ కి చైర్మన్

గా ఉన్నదన్నారు. అప్పుడే రైల్వే జోన్ ఏర్పాటు అనేది అతని చేతిలోనే ఉందన్నారు. ఆ కమిటీ సూచిస్తే వెంటనే రైల్వే జోన్ వచ్చేదన్నారు. అయితే అప్పుడు నోరు విప్పకుండా,

చంద్రబాబు డిమాండ్ మేరకు కుప్పం రైల్వే స్టేషన్ అడుక్కున్నారన్నారు. అసలు విశాఖ కి తీరని అన్యాయం చేసింది కేవలం చంద్రబాబు, తెలుగుదేశం మాత్రమేనన్నారు. అప్పుడు

చెయ్యకుండా, ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పోరాట ఫలితంగా వచ్చిన రైల్వే జోన్ పై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

గృహప్రవేశం

వెంటనే రైల్వే జోన్ వచ్చింది :

ఇటీవలే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ లో నూతన ఇల్లు గృహప్రవేశం చేసారని, ఆ వెంటనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్

ఇస్తున్నట్టు ప్రకటన విడుదలైందన్నారు. అదే ఇంట్లో వేలాది మంది వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలకు అత్యద్భుతంగా ఆతిధ్యం ఇచ్చారన్నారు. అలాగే చంద్రబాబు కూడా

గతేడాది హైద్రాబాద్ లో గృహప్రవేశం కనీసం తన పార్టీ మంత్రులకు కూడా ఆహ్వానం లేదని, కనీసం ఒక్కడికి కూడా కప్పు కాఫీ ఇవ్వలేని స్థితి లో చంద్రబబు బాగా పీనాసి లా

ప్రవర్తించదన్నారు. మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ వాళ్లనే మీ గుమ్మం తొక్కానివ్వని పీనాసి అన్నారు. 


బ్యానర్ చూసుకోవద్దా  ?

నిరసనలు, ధర్నాలు

చేయాలనుకున్నప్పుడు బ్యానర్లు సరిగ్గా వ్రాసుకోవద్దా ..
విశాఖ లో తెలుగుదేశం నగర కమిటీ నిరసన సభ పెట్టింది. పైగా నగర టీడీపీ అధ్యక్షుడు విశాఖ దక్షిణా ఎమ్మెల్యే

వాసుపల్లి ఆధ్వర్యవం లో జరుగుతోందని, వీళ్ళకి బ్యానర్ కూడా పెట్టడం రాదు, వీళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారంటే చాలా వెటకారంగా ఉందన్నారు. . వీళ్ళు పెట్టిన

బ్యానర్ చూడండి.   " మోడీ గో బ్యాక్ . . . .  à°†à°‚ధ్రా ద్రోహులు గో బ్యాక్ . . విశాఖ అర్బన్ జిల్లా "  à°…ని ఉంది.  à°…సలు వీళ్ళు ప్రజలకు ఏమి చెప్పాలి అనుకుంటున్నారు. ఇంతకీ ఆంధ్రా

ద్రోహులు ఎవరు ? మోడీ నా లేక తెలుగుదేశం అర్బన్ జిల్లా నా ?  à°ªà±ˆà°—à°¾ à°ˆ బ్యానర్ మీద ఫోటోలు అన్ని తెలుగుదేశం నేతలవే. అంటే ఇప్పుడు ఆంధ్రా ద్రోహులు ఎవరు ? à°ˆ ఎమ్మెల్యేనే

చెప్పాలన్నారు. 

ఈ విలేకరుల సమావేశం సీనియర్ నాయకుడు రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #viswanadha raju  #bjp  #YSR Congress  #Gudivada Amarnadh  #chandrababu naidu  #lokesh  #telugudesam

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam