DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రానున్నది కాంగ్రెస్ రాజ్యమే : ఆంధ్రా  పీసీసి చీఫ్  రఘువీరా 

విశాఖపట్నం, మార్చ్ 02, 2019 (DNS Online) : à°¨à°°à±‡à°‚ద్ర మోడీ నేతృత్వం లోని భారతీయ జనతా పార్టీ రాక్షస పాలనతో à°ˆ దేశ ప్రజలు విసిగిపోయారని, రానున్న కాలం లో అధికారం లోకి వచ్చేది రాహుల్

(కాంగ్రెస్) రాజ్యమేనని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన

మాట్లాడుతూ ప్రజా సమస్యలతో రాష్ట్ర వ్యాప్తంగా గత 13 రోజులుగా బస్సు యాత్ర చేపట్టామన్నారు. ఈ బస్సు శుక్రవారం (మార్చి 1 ) సాయంత్రం విశాఖ నగరానికి చేరుకుందన్నారు.

అయితే విశాఖలో బహిరంగ సభ నిర్వహించేందుకు రాష్ట్ర డిజిపి నుంచి ముందస్తుగానే అనుమతి తీసుకున్నట్టు తెలిపారు. తీరా తమ యాత్ర విశాఖ వచ్చేసరికి ప్రధాన మంత్రి

నరేంద్ర మోడీ బహిరంగ సభ జరుగుతున్నందున కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు. ప్రధాని సభ ఎక్కడో జరుగుతోందని, తమ సభ వేరే చోట

జరుగుతుందని చెప్పినా పోలీసులు వినలేదన్నారు. దీంతో తమ యాత్ర సమయం వృధా అయ్యిందన్నారు. కేంద్రం లో మోడీ, రాష్ట్రం లో చంద్రబాబు ప్రజలకు రాక్షస రాజ్యాన్ని

ప్రత్యక్షంగా చూపిస్తున్నారని మండిపడ్డారు. రానున్న కాలం లో వీరి ఆగడాలకు ప్రజలే అడ్డుకట్ట వేస్తారన్నారు. రాహుల్ ప్రధానిగా భాద్యతలు చేపట్టిన రోజే మొట్ట

మొదటగా ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఆదేశాలు జారీచేస్తారన్నారు. అదే విధంగా అరకొరగా విశాఖ రైల్వే జోన్ ఇవ్వడాన్ని తప్పుపడుతూ, వాల్తేర్ రైల్వే

డివిజన్ ను యధాతధంగా కొత్త రైల్వే జోన్ లోనే కలుపుతామన్నారు. à°ˆ సమావేశం లో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dnsnews  #dnsmedia  #dnslive  #dns news  #dns media  #congress  #APCC  #Navjyoth Singh Sidhu  #Raghuveeraa Reddy  #Pallamraju 

#Subbaramireddy  #Dronamraju srinivas  #press meet  #rahul  #narendra modi
  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam