DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లోకేష్ మేలుకోకుంటే బుద్ధా వెంకన్నల తయారవుతాడు: ఎమ్మెల్యే విష్ణు 

విశాఖపట్నం, మార్చ్ 02, 2019 (DNS Online) : విదేశాల్లో చదువుకున్న మంత్రి లోకేష్ కూడా ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చూసి చదివితే బుద్ధా వెంకన్నలాగా తయారవుతాడని, బీజేపీ శాసన సభ

పక్షనేత పి విష్ణు కుమార్ రాజు అభిప్రాయ పడ్డారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు చేసిన కేంద్రం పై రాష్ట్ర ఐటి మంత్రి లోకేష్ చేసిన విమర్శలు అర్ద

రహితమన్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ లు చదివితే ఆయన చదివిన చదువుకు విలువ పోయి బుద్ధా వెంక్కన్న లాగానో, మరొకరి లాగానో మారిపోతాడన్నారు. 
భారతీయ రైల్వేలు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని, రైల్వే పరంగా వచ్చే ప్రతి రూపాయి పూర్తిగా కేంద్రానికే వెళ్ళిపోతాయని చిన్న పిల్లలకు కూడా తెలుసునన్నారు. దేశ వ్యాప్తంగా

రైల్వే అవసరాలను బట్టి నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. విశాఖ రైల్వే జోన్ ద్వారా అదనపు రైళ్లు, కొత్త లైన్లు వేసుకునే వెసులుబాటు ఉంటుందని, లోకల్ రైళ్లు

నడుపుకోవచ్చన్నారు. 
అలాంటిది తెలుగుదేశం పార్టీ లో పనిలేనివారంతా కలిసి బీజేపీ ని, నరేంద్ర మోడీ ని విమర్శించేందుకు మరే అంశం దొరక్క రైల్వే జోన్ పై, దానికి

వచ్చే ఆదాయం పై దొంగ లెక్కలు చెప్తున్నారన్నారు. వాల్తేర్ డివిజన్ ను ముక్కలు చెయ్యడం వల్ల ఆంధ్రా కి రూ. 6500 కోట్ల ఆదాయం నష్టం వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు సహా

పనిలేని కార్యకర్తల వరకూ అంతా ఇదే పాట పడుతున్నారన్నారు. ఆఖరికి విదేశాల్లో చదువుకున్న లోకేష్ కూడా ఇదే పాట పడుతూ. . . తల్లిని చంపి - పిల్లని బ్రతికించారు అంటూ

గతంలో రాష్ట్ర విభజన పై కాంగ్రెస్ తీరును తప్పుపడుతూ నరేంద్ర మోడీ చేసిన వ్యాక్యలను కాపీ కొట్టడం చూస్తుంటే ఎవరో రాసిన స్క్రిప్ట్ ను చదవడం వల్ల ఆయన బుద్ధా

వెంకన్న లా మారతారని హెచ్చరించారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #bjp  #vizag  #viswanadha raju  #visakhapatnam  #MLA  #vishnu kumar raju  #narendra modi  #railway zone  #south coast railway  #telugudesam  #lokesh  #chandrababu naidu

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam