DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పేరుకే పెద్ద నేతలు ప్రెస్ మీట్ లో కాళ్ళు పంగజాపి మాట్లాడతారు?

విజ్ఞత కోల్పోయి, కాళ్ళు సాగదీసి ప్రెస్ మీట్. ?

ప్రెస్ మీట్ లో ఎలా ఉండాలో కూడా తెలియని వీళ్లా నేతలు? 

విశాఖపట్నం, మార్చి 03, 2019 (DNS Online) : కాళ్ళు పంగజాపి మరీ

ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నవాళ్ళు సామాన్యులు కారు. అసామాన్యులు. జాతీయ పార్టీకి చెందిన మహా నేతలు. మాజీ కేంద్ర మంత్రులు, ప్రస్తుత ఎంపీలు, రాష్ట్ర పార్టీ

అధ్యక్షులు. పదిమందిలో ఎలా ఉండాలో అదికూడా డజన్ల కొద్దీ మీడియా కెమెరాల్లో కాబాపడుతున్నామనే కనీస ఇంగితం కూడా లేకుండా. . . ప్రెస్ మీట్ నుద్దేశించి భారీ

ప్రసంగాలు చేసేసారు. 

కాంగ్రెస్ పార్టీ . . . భారత దేశం లో పరిచయం అవసరం లేని పేరు. ఆరు దశాబ్దాల పాటు పాలన చేసిన ఈ పార్టీ 2014 లో చేసిన స్వయంకృతాపరాధం వల్ల ఆంధ్ర

ప్రదేశ్ లో పార్టీ తుడిచి పెట్టుకు పోయింది. అయితే కొనప్రాణంతో ఉన్న పార్టీకి జీవం పోయాలని చేస్తున్న కృషి లో రాష్ట్రానికి చెందిన బడా నేతలు, ప్రజా ప్రతినిధులు

కనీస విజ్ఞత కూడా కోల్పోయారు. శనివారం నగర పర్యటనకు వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు

à°Ÿà°¿. సుబ్బరామిరెడ్డి, మాజీ కేంద్ర  à°®à°‚త్రులు à°Žà°‚ à°Žà°‚ పల్లంరాజు, జెడి శీలం, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. విలేకరుల సమావేశం లో పాల్గొన్న వీరు

కనీస విజ్ఞతను కూడా కోల్పోయి, కాళ్ళు చాపుకుని, కాసేపు కునుకు కూడా వెయ్యడం కెమెరాల్లో బందీ కూడా అయ్యింది. వీరందరికీ చట్టసభల్లో పాల్గొన్న అనుభవం బాగానే ఉంది.

జాతీయ మీడియా సమావేశాల్లో సైతం పాల్గొన్న అనుభవం ఉంది. అయితే శనివారం విశాఖ లో జరిగిన విలేకరుల సమావేశం లో మాత్రం కాలు సాగదీసి చాపుకుని మరీ.. కనీస విజ్ఞత ను సైతం

మరిచిపోయారు. పైగా వాళ్ళు చెప్పాలి అనుకున్నది చెప్పేసి వెళ్లిపోవడం మీడియా వర్గాలను విస్మయానికి గురిచేసింది. కనీస ప్రశ్నావళి కి కూడా అవకాశం ఇవ్వకుండా వారి

ధోరణిలో à°’à°• తరగతిలో విద్యార్థి పాఠం అప్పగించినట్టు . . . వీళ్ళు చెప్పాలి అనుకున్నది చెప్పేసి చాప చుట్టేసి వెళ్లిపోవడం గమనార్హం. 
వీళ్ళు చెప్పిన అంశంపై

మీడియా వారు ఏదైనా అడుగుతారా అని కనీస సంస్కారం గా కూడా ప్రవర్తించకుండా ఎదో పార్టీ మీటింగ్ లోనో, పబ్లిక్ మీటింగ్ లోనో మాట్లాడిటినట్టు బాగా ఫీల్ అయి అక్కడి

నుంచి వెళ్లిపోవడం గమనార్హం. వీళ్ల దగ్గర సమయం లేదుట. . అందుకే ప్రశ్నలు వెయ్యకూడదు à°Ÿ. అదీ సదరు రఘువీరా రెడ్డి చెప్పిన విషయం. 

దీంతో మీడియా వర్గాలు ఈ బడా

నేతలపై మండిపడ్డాయి. 

 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju    #visakhapatnam   #congress   #andhra pradesh  #subbarami reddy  #raghuveera reddy
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam