DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నలభై ఏళ్ళని నమ్మితే  నట్టేట ముంచాడు : బాబు పై అవంతి ఫైర్

విశాఖపట్నం), మార్చి 08, 2019 (డి ఎన్ఎస్): నలభై ఏళ్ళు అనుభవం ఉన్నవాడు అని చంద్రబాబు ని నమ్మి ఆంధ్ర ప్రజలు ఓటు వేస్తె నట్టేట ముంచాడని అనకాపల్లి ఎంపీ ఎం. శ్రీనివాసరావు

మండిపడ్డారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా విశాఖ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో నగర మహిళా కమిటీ నిర్వహించిన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిధిగా

పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా చంద్రబాబు కి ఆంధ్ర ప్రదేశ్ లోని మహిళలు గుర్తుకు రాలేదని, ఇప్పుడు ఎన్నికల సమయం కావడం తో పసుపు కుంకుమ

అంటూ మూడు విడతలుగా పదివేల రూపాయలు ( మూడు చెక్కులు, ఎన్ని చెల్లుతాయి తెలీదని), అంతకు ముందు డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ అంటూ నానా కబుర్లు చెప్పారన్నారు. భారత దేశ

చరిత్రలో స్వతంత్ర పోరాటం లోను, పరిపాలన లోనూ మహిళలే అగ్ర స్థానం లో ఉన్నారన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి నుంచి, సరోజని నాయుడు, నిత్య అన్నప్రదాత డొక్కా సీతమ్మ, లాంటి

భారత ప్రధాని గా ఇందిరా ప్రియదర్శిని అందించిన భారతావని లో ఎందరో మహిళామణులు అత్యున్నత స్థాయి లో ఆయా రంగాల్లో విజయాలు సాధించి భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి

చాటారన్నారు. 

ఈ వేడుకల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు గరికిన గౌరీ మాట్లాడుతూ మహిళలకు తగిన గుర్తింపు ఇవ్వడం ప్రతి ఒక్కరి

కర్తవ్యమ్ అన్నారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మహిళకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, ప్రతి కమిటీలోనూ సముచిత స్థానం అందించారన్నారు. అనంతరం వివిధ

రంగాల్లో ఉన్నత సేవలు అందిస్తున్న మహిళలను సత్కరించారు. 
à°ˆ వేడుకల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు మాజీ కేంద్ర మంత్రి  à°•à°¿à°²à±à°²à°¿

కృపారాణి, మహిళా నేతలు వరదు కళ్యాణి, ఎంవివి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #ysr congress  #avanthi srinivas  #MP  #YS jagan mohan reddy  #garikina gouri  #International Women's Day  #chandrababu naidu  #telugudesam party

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam