DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా సింహాచల సుదర్శన నృసింహ యాగం 

విశాఖపట్నం, మార్చి 12, 2019 (డి ఎన్ఎస్): తొమ్మిది రోజుల పాటు జరుగనున్న సుదర్శన నృసింహ యాగం మంగళవారం పాంచరాత్రాగమ విధానం లో అత్యంత వైభవంగా ఆరంభమైంది. ప్రారంభోత్సవ

కార్యక్రమానికి త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి, త్రిదండి అహోబిల జీయర్ స్వాములు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా యాగ కార్యక్రమం లో

చేపడుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక కోరికలు, వ్యాపార అభివృద్ధికి, కుటుంబ క్షేమానికి తదితర అభివృద్ధి కొరకు నిర్వహించే ఇష్టి కార్యక్రమాలు

మంగళ వారం నుంచి మొదలు కానున్నాయి. ఒక్కొక్క రోజు, ఒక్కొక్క ఇష్టి కార్యక్రమం జరుగనుంది. విశాఖపట్నం ముడసర్లోవ పార్కు నుంచి సింహాచలం వెళ్లే మార్గం లోని శ్రీ

వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం వారి గోశాల లో జరుగుతున్న ఈ యాగం లో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కావాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. యాగాన్ని

చూసేందుకు వచ్చే భక్తులందరికీ తదీయారాధన సైతం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ అన్న ప్రసాదం తీసుకునే వెళ్లాలని కోరుతున్నారు. ఈ యాగం లో వివిధ ప్రాంతాలకు చెందిన

ఋత్విక్కులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #simhachalam  #yagam  #sudarshana yagam  #nrusimha yagam  #chinna jeeyar  #ahobila jeeyar

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam