DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈవీఎం లు మొరాయించినా  కొత్తవలసలో సజావుగా ఎన్నికలు  

(రిపోర్ట్ : పివి రంగాచార్యులు)
కొత్తవలస (విజయనగరం) , ఏప్రిల్ 11 , 2019 (DNS Online డిఎన్ఎస్ ) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అత్యంత ఇబ్బందికర వాతావరణంలో సైతం సిబ్బంది నిబద్దతతో

విధులు నిర్వహించడంతో కొత్తవలసలో పోలింగ్ సజావుగా సాగింది. ఉదయం నుంచి సాంకేతిక ఇబ్బంది తలెత్తడంతో ఈవీఎం మిషన్లు మొరాయించాయి. మొత్తం మూడు పోలింగ్

కేంద్రాల్లో 3600 కు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశారు.  à°ªà±‹à°²à°¿à°‚గ్ ఆలస్యం à°—à°¾ మొదలు కావడంతో సాయంత్రం 5 :30  à°—à°‚à°Ÿà°² సమయానికి సుమారు వెయ్యి

మందికి పైగా ఓటర్లు క్యూ లైన్లలో వేచియున్నారు. 
మంగళం పాలెం గ్రామంలో మూడు పోలింగ్ బూత్ లకు గాను 227 లో 300 కు పైగా ఓట్లు, 228 లో కేవలం 30 ఓట్లు మాత్రమే ఉండగా,  229 లో 250  à°•à°¿

పైగా ఓట్లు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగించాల్సి యుండగా, ఆ సమయానికి క్యూ లైన్లలో సుమారు 350 మంది వేచియుండడంతో వారికి

టోకెన్లు ఇచ్చి, ఆఖరి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సిబ్బంది చర్యలు తీసుకున్నారు. సిబ్బంది ఓర్పు తో వ్యవహరించి, ఈవీఎం లు మొరాయించినా, ఓటర్లకు

సమస్యను వివరించి, వారి సహకారాన్ని కోరడం తో సిబ్బందిని అభినందించారు. à°ˆ ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. 

ఓటు హక్కు పై అవగాహన

:

ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా కొందరు యువత గత రెండు వారాలుగా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ దేశం పౌరులకు కల్పించిన

హక్కు ఓటు. ఈ దేశ పాలకులను ఎన్నుకుని చట్టసభలకు పంపే అవకాశం కల్పించేదే ఈ ఓటు అని. ప్రతి ఒక్కరూ యధావిధిగా పాల్గొని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, తమకు మంచి

అనిపించిన అభ్యర్థులకు ఓటు వేసి, రాజ్యాంగం కల్పించిన హక్కుని వినియోగించుకోవాలనంటూ ర్యాలీలు కూడా చేశారు. 

 

 

#dns  #dns live  #dns news  #dns media  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #telugudesam  #YSR congress 

#elections  #kothavalasa

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam