DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్న జీయర్ స్వామి సమక్షంలో విశాఖ లో 27 న నేత్ర విజయం

అంతర్జాతీయ అథ్లెటిక్స్ లో నేత్ర విద్యాలయ -వారిజ కు 14 పతకాలు. .

. శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి రాక, చిల్డ్రన్ ఎరీనా లో నేత్ర విజయోత్సవం.

.

విశాఖపట్నం, ఏప్రిల్ 26, 2019 (DNS online) : ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి సమక్షంలో వారిజ నేత్ర

విద్యాలయం విద్యార్థుల నేత్ర విజయోత్సవ వేడుకలు జరుగనున్నట్టు నేత్ర విద్యాలయ -వారిజ నిర్వాహక కమిటీ ప్రతినిధులు తెలియచేసారు. శుక్రవారం నగరం లోని ద్వారకానగర్

లో గల పౌర గ్రంధాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ విశాఖ సాగర తీరం లో గల వారిజ (మంగమారిపేట) జీయర్ స్వామి ఆశ్రమం లోని తమ నేత్ర విద్యాలయం

విద్యార్థిని విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా à°ˆ నెల 27 à°¨ నేత్ర విజయం వేడుకలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 
/> శ్రీలంక కొలంబో లో ఈ నెల 16 ,17 తేదీల్లో జరిగిన అంతర్జాతీయ పారా గేమ్స్ 2019 లో మొత్తం 14 పతకాలు పొందగా, వాటిల్లో 9 బంగారు పతకాలు, 4 రజత పతకాలు, 1 కాంస్య పతకం సాధించారని

వివరించారు. ఈ పోటీలు ఆసియన్ ట్రాక్ అండ్ టర్ఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యవంలో జరిగాయన్నారు.
గత 2018 డిసెంబర్ 10 నుంచి 13 తేదీల్లో న్యూఢిల్లీ లో జరిగిన 21 వ జాతీయ అథ్లెటిక్స్ (

బ్లైండ్ ) క్రీడల్లో వారిజ విద్యార్థులు బి 3 బాలికల విభాగం లో టీమ్ ఛాంపియన్ షిప్ గెలవగా, మొత్తం 6 పసిడి పతకాలు, 6 రజత పతకాలు , 6 కాంస్య పతకాలు సాధించినట్టు తెలిపారు. ఈ

పోటీలు ఇండియన్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ , బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించినట్టు వివరించారు. 
వీరి ప్రతిభకు తగిన ప్రోత్సాహాన్ని

ఇచ్చే విధంగా నేత్ర విజయం పేరిట ఈనెల 27 న అభినందన సభ నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సభ శనివారం ( ఏప్రిల్ 27 ) సాయంత్రం 6 :30 గంటలకు విశాఖనగరం లోని సిరిపురం లోగల ఉడా

చిల్డ్రన్ ఎరీనా ( పాత చిల్డ్రన్ ధియేటర్) లో జరుగుతుందన్నారు. ఘన విజయం సాధించిన చిన్నారులకు ప్రత్యక్షంగా మంగళశాసనములు అందించేందుకు నేత్ర పాఠశాల

వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయరు స్వామిజి నగరానికి హాజరుకానున్నారన్నారు. 
ఈ జ్ఞాన నేత్ర స్వరూపులను ఆశీర్వదించేందుకు ముఖ్య అతిధులుగా

విశాఖ జిల్లా కలెక్టర్ కె. భాస్కర్, మై హోమ్ సంస్థ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర రావు, విశిష్ట అతిధులుగా నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా, విశాఖ మెట్రో

రీజియన్ అధారిటీ కమిషనర్ (విఎంఆర్డీఏ) పి బసంత్ కుమార్, జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ జి. సృజన, జిల్లా విద్యాశాఖాధికారి బి. లింగేశ్వర రెడ్డి, దివ్యంగుల శాఖా

అదనపు సంచాలకులు పి. వెంకటేశ్వర రావు తదితరులు హాజరుకానున్నట్టు తెలిపారు.

ఆసియన్ ట్రాక్ అండ్ టర్ఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యవంలో అంతర్జాతీయ పారా గేమ్స్ 2019 లోవారిజ

బాల బాలికలు సాధించిన పతకాల వివరాలు :

ఈ పోటీల్లో నేత్ర దృష్ఠి విభాగం లో మూడు విభాగాలు ఉంటాయని, వాటిల్లో మొదటి విభాగం బి 1 : పూర్తి అంధత్వం, రెండవ విభాగం బి 2 :

పాక్షిక అంధత్వం, మూడవ విభాగం లో బి 3 : మరింత మెరుగు దృష్ఠి ఉన్న వారిని విభజించి పోటీలు నిర్వహించారు. .

అంతర్జాతీయ పారా గేమ్స్ 2019 విజేతలు వీరే : .

బి 1 విభాగం

లో : 1 ) à°“ . జగన్ - 2 బంగారు పతకాలు ( 200 మీటర్ల పరుగు, షాట్ ఫుట్ ) సాధించగా, 
2 ) జి. నాగరాజు - 1 బంగారు పతాకం ( డిస్క్ త్రో ), 1 రజత పతాకం ( 100 మీటర్ల పరుగు), 
3 ) టి. కృష్ణవేణి - 1 బంగారు పతాకం ( 100

మీటర్ల పరుగు ), 1 రజత పతాకం ( 200 మీటర్ల పరుగు ) లు గెలుపు సాధించగా,

బి 2 విభాగం లో : కె. లలిత 1 బంగారు పతాకం ( 100 మీటర్ల పరుగు ), 1 రజత పతాకం ( 200 మీటర్ల పరుగు) క్రీడా పటిమ

చూపింది.

బి 3 విభాగం లో : 1 ) ఏ. వంశీ - 1 బంగారు పతాకం ( 100 మీటర్ల పరుగు ), 1 రజత పతాకం ( లాంగ్ జంప్ ) , 
2 ) à°Žà°‚. సత్యవతి - 2 బంగారు పతకాలు ( షాట్ ఫుట్ , డిస్క్ త్రో ) , 
3 ) బి. సీతాలక్ష్మి - 1

బంగారు పతకం ( 100 మీటర్ల పరుగు ), 1 కాంస్యం పతకం ( 200 మీటర్ల పరుగు ) లు విజేతలుగా నిలిచారు. .

21 వ జాతీయ అథ్లెటిక్స్ ( బ్లైండ్ ) క్రీడలు, న్యూఢిల్లీ, 2018 డిసెంబర్ 10 వివరాలు :

.

బి 3 బాలికల విభాగం లో టీమ్ ఛాంపియన్ షిప్ గెలవగా, మొత్తం 6 పసిడి పతకాలు, 6 రజత పతకాలు , 6 కాంస్య పతకాలు సాధించినట్టు తెలిపారు. 12 విభాగాల్లో 24 పాయింట్లతో మొదటి

స్థానం సాధించారు.

నేత్ర విద్యాలయ -వారిజ విద్యార్థులకు మేనేజర్లు పి.లక్ష్మి, మాధురి, శిరీష లత, శిక్షకులు సోమేశ్వర రావు, తదితరులు ప్రధాన భూమిక

వహిస్తున్నట్టు తెలిపారు. .

వారిజ నేత్ర విద్యాలయం : .

Veda Adhyayana Research Institute of Jeeyar Academy (వారిజ) పేరిట 2003 లో చిన్న జీయర్ స్వామి విశాఖ సాగర తీరంలోని మంగమారిపేట వద్ద స్థాపించడం

జరిగింది. పూర్తిగా సోలార్ సాంకేతిక విధానం ద్వారా విధ్యుత్ సరఫరా లభించే ఏర్పాటు చేయడం జరిగింది. వేద పరిశోధన, అధ్యయనం చేసే విద్యార్థులతో ప్రారంభమైన ఈ సంస్థ.
2001

లో దృష్టి లోపం ఉన్న వారికి అద్భుతమైన విజ్ఞానం అందించేందుకు శ్రీ శ్రీ శ్రీ జీయర్ స్వామి వారి సంకల్పంతో నేత్ర విద్యాలయం ప్రారంభించడం జరిగింది. నాటి నుంచి

ఇంతింతై వటుడింతై అనే రీతిలో ఈ సంస్థలు విశ్వ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలను ప్రసరిస్తున్నాయి.

నేత్ర దృష్ఠి లోపం ఉన్న వారు జ్ఞాన నేత్రాలతో ప్రపంచాన్ని

శాసించగలరు అనే సంకల్పంతో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయరు స్వామి వారి చే ఒక దశాబ్దం క్రితం నాటిన విత్తనం

నేడు ఇంతింతై వటుడింతై అన్న రీతిలో తమ ఖ్యాతి ని ప్రపంచదేశాలకు చాటుతున్నారు. ప్రశాంత విశాఖ సాగర తీరంలో ఉన్న ఈ నేత్ర విద్యాలయ -వారిజ విద్యార్థులు సామాన్య

విద్యను అత్యాధునిక సాంకేతిక విజ్ఞాన సహకారంతో సునాయాసంగా నేర్చుకుంటూ అసామాన్య రీతిలో తమ విజ్ఞానాన్ని ప్రపంచం ముందు ప్రదర్శిస్తూ స్వామిజి మంగళశాసనములు

సంపూర్ణాంగా అందుకుంటున్నారు. ఒక ప్రక్క విద్య తో పాటు, ఆటలు, పాటల్లోనూ తమ ప్రజ్ఞా పాటవాలను చాటుతున్నారు. గతంలో పరమేష్ తన సుస్వర గానం ప్రముఖ టెలివిజన్ ఛానెల్

నిర్వహించిన పాటల పోటీలో ప్రధమ స్థానం లో నిలిచి మూడు లక్షల నగదు పురస్కారాన్ని గెలుచుకోవడంతో ఈ పాఠశాల తన విజయ ప్రస్థానాన్ని ఆరంభించింది. గతంలో ఈ పాఠశాల

విజయనగరం లో ఉండేది, ప్రత్యేక నిర్వహణకై ఈ విద్యాలయాన్ని విశాఖలోని వారిజ కు తరలించడం జరిగింది. నాలుగేళ్ళ క్రితం సంభవించిన హుధుద్ తుఫాన్ బీభత్సం లో సైతం వీరు

మొక్కవోని ధైర్యాన్ని చాటారు.

ఈ విలేకరుల సమావేశంలో వారిజ నిర్వాహక కమిటీ అధ్యక్షులు శ్రీమాన్ ఎంఎస్ రాజు, కార్యదర్శి శ్రీమాన్ టి. నారాయణ రెడ్డి, నేత్ర

విద్యాలయ అధ్యక్షులు శ్రీమాన్ పీఎస్ఎన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #dnsonline  #dns online  #visakhapatnam  #vizag  #Varija  #Nethra vidyalaya  #bheemili  #chinna jeeyar swamiji  #blind school  #Games  #VUDA Children arena
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam