DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐసిసి రిఫరీ ప్యానెల్ లో తోలి మహిళ గా రాజమండ్రి వాసి ఎంపిక 

విశాఖపట్నం, మే 17 ,2019 (DNS Online ) : ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్ర వరం కు చెందిన జి ఎస్ లక్ష్మి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ఐసిసి ) చే రిఫరీ ప్యానెల్

లో సభ్యురాలి గా నియమితులయ్యారు. అది కూడా మొట్టమొదటి మహిళా సభ్యురాలిగా ఆంధ్రా కు చెందిన మహిళే ఎంపికవ్వడం అందరికీ గర్వకారణం. ప్రపంచం లోనే అత్యంత ఆదరణ కల్గిన

క్రీడా క్రికెట్. దీనికి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థ ఐసిసి ( ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్). క్రికెట్ రంగాల్లో ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోవాలన్నా

ఈ సంస్థ అనుమతి తప్పని సరి. అలాంటిది ఆ సంస్థ చే గుర్తింపు పొంది, అంతర్జాతీయ రిఫరీ ప్యానెల్ లో సభ్యురాలిగా ఎంపిక కావడం పట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు, క్రీడాభిమానులు

హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2008 -09 నుంచి దేశీయ క్రికెట్ క్రీడలకు రిఫరీగా సేవలందిస్తున్న ఈమె ఇంతవరకూ మూడు మహిళ ప్రపంచ కప్ పోటీలకు కూడా సేవలందించారు. ఇక పై

పూర్తిస్థాయి లో క్రికెట్ క్రీడారంగంలో ఈమె సేవలను కొనసాగనున్నాయి. త్వరలో జరుగనున్న ప్రపంచ కప్ పోటీల్లో సైతం ఈమె సేవలు వినియోగింపబడే సూచనలు ఉన్నట్టు

తెలుస్తోంది. 

 

courtesy pix: to whom so ever it may concern

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam