DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎగ్జిట్ పోల్స్ కావవి. . . పే ఇట్ పోల్స్ 

ఎవరి పేకేజీ తగ్గట్టు వాళ్ళ రిపోర్ట్ లు . .  .

మండిపడుతున్న పార్టీలు, ఆశావహులు 

విశాఖపట్నం, మే 19, 2019 (DNS Online డీఎన్ఎస్ ): ఆదివారం తో ముగిసిన భారత దేశ ఎన్నికల

పోలింగ్ అనంతరం సాయంత్రం దేశ వ్యాప్తంగా పలు సంస్థలు, ఔత్సాహికులు విడుదలైన ఫలితాలు పే ప్యాకేజి ల అంకెలంటూ పార్టీలు మండిపడుతున్నాయి. అస్తవ్యస్తంగా నోటికి

వచ్చిన అంకెల తో గల్లీ నుంచి ఢిల్లీ వరకూ విడుదలైన ఏ రెండు సర్వేలు ఒకే విధంగా ఫలితాలను చెప్పలేక పోయాయి. ఈ లెక్కల గారడీ చూస్తుంటే ఎవరికీ దక్కిన ప్యాకేజి బట్టి

ఆయా అంకెలు ముందడుగు వేసినట్టే కనపడుతోంది. 
ఒకరు ఎడ్డెం  à°…ంటే మరొకరు తెడ్డెం అన్న విధంగా చెప్పడంతో ఇటు పార్టీలు, అటు ఎన్నికల్లో కోట్లాదిగా డబ్బులు

విచ్చలవిడిగా ఖర్చు చేసిన అభ్యర్థులు  à°ˆ సర్వేల పై మండిపడుతున్నారు. వీళ్లంతా వివిధ పార్టీల నుంచి ప్యాకేజీలు వసూలు చేసుకుని వాళ్లకి అనుకూలంగా అంకెలు

ప్రకటించారంటూ ఇటు అధికార, అటు ప్రతి పక్ష పార్టీల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ హావ నడుస్తోందంటూ అందరూ

భావింస్తున్న తరుణంలో మాజీ ఎంపీ లగడపాటి సహా పలువురు అధికార పార్టీ అండతో కప్పల తక్కెడ లెక్కలు చెప్పారంటూ వైకాపా నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇక రాష్ట్ర

వ్యాప్తంగా ప్రచారంతో ఒక ఊపు ఊపిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ కు కనీసం ఒక్క సీటు కూడా రాదంటూ ఫలితాలు చెప్పడంతో జనసేన అభిమానులు నిరాశకు గురవుతున్నారు. అయితే

అధికారిక లెక్కలు మరో మూడు రోజుల్లో రానుండడం తో కొంత ఆశాభావంతో ఉన్నారు. ఇక ఢిల్లీ పీఠం పై మళ్ళీ మోడీ యే గద్దెనెక్కుతారంటూ దాదాపు గా లెక్కలు ప్రకటించేసాయి.

అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ అభిమాన మీడియా చానెళ్లు మాత్రం మోడీ à°•à°¿ à°ˆ సారి చుక్కలు కనపడతాయంటూ లెక్కలు చూపించాయి. 

 

#dns  #dns_news  #dns_online  #dns_media  #visakhapatnam  #vizag  #assembly  #parliament  #elelctions  #exit polls

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam