DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఘనంగా వి జె ఎఫ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

ఘనంగా వి జె ఎఫ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

పాత్రికేయులకు à°…à°‚à°¡à°—à°¾ నిలబడతాం : మంత్రి à°—à°‚à°Ÿà°¾ 

పాత్రికేయుల పిల్లలకు స్కూల్ ఫీజు లో 50 రాయితీ కి

ఆమోదం. 

విశాఖపట్నం, మే 14, 2018 (DNS Online): రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉన్న పాత్రికేయులకు ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుందని రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా

శ్రీనివాసరావు తెలియచేసారు. సోమవారం ఉదయం విశాఖపట్నం లోని పోర్ట్ డైమండ్ జూబిలీ క్రీడా మైదానం లో వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం (విజెఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న

 à°°à°¾à°·à±à°Ÿà±à°° స్థాయి అక్రిడిటేడ్ పాత్రికేయుల క్రికెట్ టోర్నీని ఆయన ప్రారంభించారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతరులు ఆడుతుంటే à°† క్రీడలను కవరేజ్ చేసే

పాత్రికేయులు కూడా మైదానం లో క్రీడలను ఆడాలనే సంకల్పంతో గత నాలుగేళ్లుగా రాష్ట్ర స్థాయి పాత్రికేయుల క్రీడల పోటీలను నిర్వహిస్తున్న వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్

కు అభినందనలు తెలిపారు. అదే విధంగా తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం పాత్రికేయులకు ఇళ్ల నిర్మాణం కై హామీ ఇచ్చిందని, దాన్ని నిలబెట్టుకునే విధం గా చర్యలు

తీసుకుంటున్నట్టు ప్రకటించారు. విశాఖ జిల్లాలో పాత్రికేయులకు గతం లో కేటాయించిన ఇళ్ల స్థలాల పై ఉన్న సమస్యను కూడా తొలగించే ప్రయత్నం

జరుగుతోందన్నారు. 

పిల్లల స్కూల్ ఫీజు లో 50 శాతం రాయితీ :

ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ మారు కూడా పాత్రికేయుల పిల్లలకు వారు చదువుతున్న స్కూల్ ఫీజుల్లో 50 రాయితీ

ఇచ్ఛే విధంగా తగు ఆదేశాలు ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులకు ఇవ్వడం జారుతుందన్నారు. అయితే ఆయా జిల్లాల పాత్రికేయ సంఘాలు దీనిపై ఒక వినతి పత్రం

అందించాలన్నారు. 

ప్రతీ స్కూల్ à°•à°¿ మైదానం లో క్రీడలు తప్పని సరి చెయ్యాలి : à°Žà°‚ పి ముత్తంశెట్టి 

రాష్ట్రం లోని ప్రతీ పాఠశాల, ( ప్రభుత్వ, ప్రయివేట్ అన్నీ ) ల్లోనూ

విద్యార్థులను సమీపం లోని క్రీడల మైదానంలోని తీసుకు వెళ్లి తప్పని సరిగా ఏదేని ఒక క్రీడా ఆడించేలా చర్యలు తీసుకోవాలని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు

ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంత్రి గంటాను కోరారు. 
మైదానం లేని స్కూళ్ల కు ఆయా నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రభుత్వ పరిధి మైదానాలను కేటాయించేలా చర్యలు

తీసుకోవాలన్నారు. పాత్రికేయ క్రీడలు పూర్తి స్తాయి పోటీల మాదిరిగానే హోరా హోరీ గా జరుగుతున్నాయని, గత మూడు సంవత్సరాలుగా విజెఎఫ్ నిర్వహిస్తున్న క్రికెట్

పోటీలు నిరూపించాయన్నారు. 

ప్రధాన ప్రాయాజక కర్త సీఎంఆర్ అధినేత మావూరి వెంకట రమణ మాట్లాడుతూ ప్రజలకు సహకరించే పాత్రికేయులకు సహకారం చేయడం భాద్యత గా

భావించినట్టు తెలిపారు. 

అనంతరం అనకాపల్లి ఎంపీ బౌలింగ్ వెయ్యగా, మంత్రి à°—à°‚à°Ÿà°¾ బ్యాటింగ్ చేసి క్రీడలను ప్రారంభించారు. 

ఈ కార్యక్రమం లో యలమంచిలి ఎం ఎల్ ఏ

పంచకర్ల రమేష్ బాబు, స్వాతి ప్రమోటర్స్ అధినేత కృష్ణా రెడ్డి, హెచ్ పీ సి ఎల్ ఈడీ శర్మ, ఏ పీ ఈ పీ డీ సి ఎల్ ఎం డీ దొర, ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు సాంబశివరావు,

పాల్గొన్నారు. . 

విశాఖపట్నం జిల్లా పాత్రికేయులకు మార్గదర్శకం చేస్తూ, అన్ని విధాలుగా సహకారం చేస్తూ, ప్రభుత్వం పాత్రికేయులకు అందించే పధకాలను అర్హులైన

పాత్రికేయులందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్న విశాఖ జిల్లా సమాచార శాఖ డిప్యూటీ డైరక్టర్ మణిరామ్ ను మంత్రి చేతుల మీదుగా సత్కరించింది వి జె ఎఫ్ కమిటీ. 

వి

జె ఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్. దుర్గారావు, కమిటీ ప్రతినిధులు నాగరాజు పట్నాయక్, ఇతర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam