DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిజామాబాద్ ఎంపీ అరవింద్ సంచలన నిర్ణయం

రైతు సమస్య తీర్చకుంటే తక్షణ రాజీనామా.. 

బాండ్ పత్రం పై లిఖిత హామీ 

హైదరాబాద్ , మే 24 , 2019 (DNS Online ): పసుపు రైతులకు తక్షణ సానుకూల పరిష్కారం చూపించలేని పక్షంలో తన

ఎంపీ పదవికి తక్షణం రాజీనామా చేస్తానంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రూ. 100 బాండు పత్రం పై లిఖిత పూర్వక హామీ ప్రకటించారు. 
ఈ ఎన్నికల్లో సంచలనాలకు

మారుపేరుగా నిలిచినా నిజామాబాద్ ( తెలంగాణ ) మరో సంచలనానికి దారితీసింది. గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ ఎంపీ గా విజయం సాధించిన ధర్మపురి

అరవింద్ ( భారతీయ జనతా పార్టీ) సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇదే ఎన్నికల్లో తమ సమస్యలను పరిష్కరించమంటూ నిరసనగా సుమారు 180 మంది పసుపు రైతులు ఈ ఎన్నికల్లో లోక్ సభ

బరిలో నామినేషన్లు దాఖలు చేసి దేశంలోనే సంచలనం సృష్టించారు. వీళ్ళ డిమాండ్ సమంజసం కావడంతో వీళ్ళ సమస్య పరిష్కారమే తన మొదటి ప్రాధాన్యత అని, దాన్ని

నెరవేర్చేందుకు తగిన కృషి చేస్తానంటూ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ధర్మపురి అరవింద్ రూ. 100 బాండు పత్రం పై లిఖిత పూర్వక హామీ ప్రకటించారు. ఈయన

కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్  à°®à°¾à°œà±€ అధ్యక్షుడు à°¡à°¿. శ్రీనివాస్ కుమారుడు కావడం గమనార్హం. ఈయనకు ఇదే తోలి ఎన్నిక. మొదటి పోటీలోనే లోక్ సభ ఎన్నికల్లో

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమార్తె, సిట్టింగ్ ఎంపీ కె. కవిత పైఘన విజయం సాధించారు.

 

#dns  #dns_news  #dns_media  #dns_online  #dns_live  #visakhapatnam  #vizag  #elections  #map  #nizamabad  #turmeric  #farmers  #bond  #paper  #dharmapuri  #Aravind
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam