DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భీమిలి భూ కుంభకోణాల దోషులకు శిక్ష తప్పదు ; MLA అవంతి శ్రీనివాస్

భీమిలి ప్రజ నమ్మకాన్ని వమ్ము చెయ్యను  

రాజన్న రాజ్యం ద్వారా రామరాజ్యాన్ని అందిస్తాం.  

విజెఎఫ్  à°®à±€à°Ÿà± ది ప్రెస్ లో భీమిలి ఎమ్మెల్యే అవంతి

శ్రీనివాస్ .

విశాఖపట్నం, మే 27 , 2019 (DNS Online ): భీమిలి ప్రాంతంలో జరిగిన కోట్లాది రూపాయల విలువ చేసే భూ కుంభకోణాలకు పాల్పడిన దోషులకు శిక్ష తప్పదు అని,  à°¤à°¾à°œà°¾à°—à°¾ ఎన్నికైన

భీమిలి శాసన సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. తనపట్ల విశ్వాసం కలిగి భారీ సంఖ్యలో ఓట్లు వేసి తనకు అఖండ విజయాన్ని అందించిన భీమిలి నియోజక వర్గ

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను అని తెలిపారు. నగరంలో మేఘాలయ హోటల్లో వైజాగ్ జర్నలిస్టు ఫోరం సోమవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన తన అనుభవాలను

వెల్లడించారు. గత ప్రభుత్వం లో జరిగిన అక్రమాలను భరించలేకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించినట్టు తెలిపారు. అక్రమార్కుల ఆగడాలు శృతిమించి భూ

బకాసురులుగా దాపురించారని మండిపడ్డారు. ప్రతి పనిలోనూ జన్మభూమి కమిటీల పేరిట క్రింది స్థాయి నుంచి మంత్రుల వరకూ ప్రజలను నిలువు దోపిడీ చేశారన్నారు. వీళ్ళ

ఆగడాలు భరించలేకే ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి దేశంలోనే అత్యంత సంచలన విజయాన్ని అందించారన్నారు. ఆయనకు ఉన్న

నిబద్దత ఫలితంగా రానున్న కాలంలో రాజన్న రాజ్యం ద్వారా రామరాజ్యాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చూస్తారన్నారు. అనంతరం పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఆయన

బదులిచ్చారు. ఈ సమావేశంలో విజెఎఫ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్. దుర్గారావు, ఉపాధ్యక్షులు ఆర్. జగరాజు పట్నాయక్, దాడి రవికుమార్, ఇతర

కమిటీ సభ్యులు  à°Žà°®à±à°®à±†à°¸à±à°¸à°¾à°°à± ప్రసాద్, ఈశ్వర్ రావు, గయాజ్, పెద్ద సంఖ్యలో పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

#dns  #dns_line  #dns_media  #dns_news  #dns_live  #visakhapatnam  #vzag  #bhimili  #avanthi  #VJF  #srinivas

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam