DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖాభివృద్ది కి ఉన్న అవకాశాలన్నీ సద్వినియోగం చేస్తా..

నిబద్దత కల్గిన పారిశ్రామికవేత్తని మాత్రమే 

అందరినీ కలుపుకునే వెళ్తా. . .

కక్షతో టిడిపి అధ్యక్షుడు పెట్టింది భూటకపు కేసు 

మీట్ ది ప్రెస్ లో

 à°µà°¿à°¶à°¾à°– ఎంపీ ఎంవివి సత్యనారాయణ. .

విశాఖపట్నం, మే 28 , 2019 (DNS Online ): విశాఖ నగరాభి వృద్ధి కి వచ్చే ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని రానున్న ఐదేళ్ల కాలంలో సంపూర్ణ

నగరంగా విశాఖ ను తీర్చి దిద్దుతానని నూతనంగా ఎన్నికైన విశాఖ లోక్ సభ సభ్యులు ఎంవివి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం వి జె ఎఫ్ నిర్వహించిన మీట్ ది ప్రెస్

కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఐదేళ్ల కాలం పాటు చేయవలసిన  à°ªà±à°°à°£à°¾à°³à°¿à°•à°¨à± మీడియా కు వివరించారు. ఇంతవరకూ జరిగిన అభివృద్ధి పనులను కొనసాగించేందుకై, పూర్వ

ఎంపీ డాక్టర్ కె. హరిబాబు ను కలిసి ఆశీస్సులు తీసుకున్నట్టు తెలిపారు. తనకు రాజకీయ పరంగా ప్రత్యర్థులే ఉంటారు తప్ప ఇంతవరకూ విరోధులు ఎవరూ లేరన్నారు. విశాఖ

నగరంలో ఎన్నికైన నలుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లతో సైతం తనకు సానుకూల సంబంధాలే ఉన్నాయని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనులు సాధించేలా

కృషిచేస్తానని, ఐటి రంగాన్ని అభివృద్ధిచేసేలా కృషి చేస్తానన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమల స్థాపనకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తానని హామీ

ఇచ్చారు. పర్యాటక రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తానని అన్నారు. విశాఖ సమస్యల పరిష్కారానికై తనదైన శైలి లో పార్లమెంట్ లో గళం విప్పుతానన్నారు. తాను పక్కా లోకల్

అని అంటూ , నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. విశాఖలో 24 గంటల పాటు త్రాగు నీరు అందుబాటులో ఉండేట్టు ప్రయత్నిస్తానన్నారు. విశాఖ రైల్వే జోన్

త్వరితగతిన ఏర్పాటు జరిగి, రైల్వే పరంగా రావాల్సిన అన్ని హంగులనూ వచ్చే వరకూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖా తో సంప్రదింపులు జరుగుతూనే ఉంటానన్నారు. విశాఖ

కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అని, అది ఏర్పాటు పై ప్రకటన విడుదలైందని, సంబంధిత అధికారి నియామకం కూడా జరిగిందన్నారు. తదుపరి

కార్యాచరణలో వేగవంతం కోసం ప్రజా ప్రతినిధుల సహకారం అవసరమన్నారు. ఈ సమావేశంలో విజెఎఫ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్. దుర్గారావు,

ఉపాధ్యక్షులు ఆర్. నాగరాజు పట్నాయక్, దాడి రవికుమార్, నానాజీ, ఎంఎస్ ఆర్ ప్రసాద్, ఇరోతి ఈశ్వర్ రావు, వరలక్ష్మి, శేఖర్ మంత్రి,  à°ªà±†à°¦à±à°¦ సంఖ్యలో పాత్రికేయులు

పాల్గొన్నారు. 

 

 

#dns  #dnslive  #dnsnews  #dnsmedia  #dnsonline  #dnslive  #vizag  #visakhapatnam  #MP  #MVV  #satyanarayana  #Meet  #Press  #Loksabha  #railway

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam