DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అభివృద్ధి పై అవాకులు, చెవాకులు అనడం IYR కే సొంతం : ఆనంద సూర్య 

అభివృద్ధి పై అవాకులు, చెవాకులు అనడం ఐ వై ఆర్ కే సొంతం : 

ఒకే పుస్తకం ఎన్ని సార్లు విడుదల చేస్తారు ? ఆనంద సూర్య 

పదవి లో ఉన్ననాడు తెలియ లేదా? ఐ వై ఆర్ పై

 à°¬à±à°°à°¾à°¹à±à°®à°£ కార్పొరేషన్ మండిపాటు

తమరు కాంగ్రెస్ పాలన సీఎస్ ఎందుకు అవ్వలేదు ?

ప్రతీ జిల్లాలోనూ బ్రాహ్మణ భవన్ నిర్మాణమే లక్ష్యం. :

విశాఖపట్నం, మే :     ఆంధ్ర

ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కి నిరంతరం అహరహం పాటు పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై అవాకులు చెవాకులు వ్యాఖ్యానించడం కేవలం ఐ వై ఆర్ కె చెల్లిందని

ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ వేమూరి ఆనంద సూర్య మంది పడ్డారు. సోమవారం విశాఖ నగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ పదవి లో ఉన్నత కాలం

అమరావతి పై ఎటువంటి అనుమానం ఐ వై ఆర్ కి కలుగలేదని, పదవి పోగానే, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన నాడు కూడా రాజధాని పై ఎటువంటి విమర్శలు కనిపించలేదని,

పదవీ కాలం ముగిసే నాటికి ఒక్క సారి à°—à°¾ చంద్రబాబు పై వ్యతిరేకత పెల్లుబుకిందా అని ప్రశ్నించారు. 

ఒకే పుస్తకం పదేపదే విడుదల :
ఎవరైనా ఒక పుస్తకాన్ని ఒక్క సారి

విడుదల చేస్తారని, అయితే ఒకే పుస్తకాన్ని ప్రతీ ఊరు లోనూ విడుదల చేసే సంస్కృతి కేవలం ఐ వై ఆర్ కే చెల్లిందన్నారు. ఎవరి రాజధాని అమరావతి పుస్తకం రాసిన ఐ వై ఆర్ గతం లో

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో విడుదల చేయించారని, నిన్నటి రోజున  ( మే 13 2018 ) విశాఖపట్నం లో అదే పుస్తకాన్ని మాజీ ఐ ఏ ఎస్ శర్మ, కేంద్ర సమాచార హక్కు చట్ట కమిషనర్ మాడభూషి

శ్రీధర్ తోనూ మరో మారు విడుదల చేయించారన్నారు. సమాధానం చెప్పవలసిన హోదా లో ఉన్ననాడు జవాబు చెప్పకుండా తప్పించుకున్న ఐ వై ఆర్, నేడు అదే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం

ఏపాటి సంస్కారమో ఆయనే చెప్పాలన్నారు.  

కేవలం తన నోటి దురుసు తనం కారణం గానే ఐ వై ఆర్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిని పోగొట్టుకున్నారన్నారు. బ్రాహ్మణ

కార్పొరేషన్ à°—à°¾  à°°à±†à°‚డున్నరేళ్లు పదవీ కాలం లో  à°…యన కేవలం 44 వేలమందికి ప్రభుత్వ పధకాలు అందించగలిగారన్నారు. తానూ చైర్మన్ à°—à°¾ భాద్యతలు చేపట్టిన కేవలం 10 నెలల కాలం

లోనే 46,861 మందికి లబ్ది చేకూర్చగలిగినట్టు తెలియచేసారు. 

బ్రాహ్మణుల సంక్షేమానికే పెద్ద పీట వేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలోని ప్రతీ

జిల్లాలోనూ à°’à°• బ్రాహ్మణ భవన్ ను సుమారు 5 కోట్ల రూపాయలతో నిర్మించాలనే సంకల్పంతో ఉందన్నారు. 

విశాఖ నగరాన్ని ఒక పర్యాటక హబ్ గానూ, ఐ టీ హబ్ గానూ తీర్చిదిద్దేలా

చంద్రబాబు నాయుడు  à°¬à±à°°à°¹à°¤à±à°¤à°° కార్యాచరణ చేపట్టి, à°† దిశగా కృషి చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేకపోయినా దేశ విదేశ ప్రతినిధులతో

నిరంతరం సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని, అవి పూర్తి స్తాయి లో విజయవంతం కావాలంటే రానున్న కాలం లో మరోమారు చంద్రబాబు నాయుడు కు

మద్దతు గా నిలవాల్సిన భాద్యత రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు.

ఈ విలేకరుల సమావేశం లో ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ డైరక్టర్ వి. భానుమూర్తి, విశాఖ

పార్లమెంట్ నియోజక వర్గ బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రతినిధి డిఎల్ఓ 2 కే నర్సింహా మూర్తి, బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు నాగేంద్ర, కొత్తలంక à°®à±à°°à°³à°¿ కృష్ణ తదితరులు

పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam