DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పెద్దాసుపత్రిలో పారిశుధ్యానికి పెద్ద పీట వెయ్యాలి:  మంత్రి అవంతి 

విశాఖపట్నం, జూన్ 12 ,2019 (DNS Online ): ఉత్తరాంధ్ర జిల్లాల వాసుల ఆరోగ్య దాయిని ఆశాజనకం కింగ్ జార్జి ఆసుపత్రి (పెద్దాసుపత్రి) లో పారిశుధ్యానికి పెద్ద పీట వెయ్యాలని ఆంధ్ర

ప్రదేశ్ పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ సూచించారు. బుధవారం ఉదయం ఆయన ఆసుపత్రిని సందర్శించి సూపరింటిండెంట్ డాక్టర్ అర్జున్ ను అడిగి వివిధ

వార్డుల్లో అందుబాటులో ఉన్న వైద్య సామాగ్రి, బెడ్ లు, రోగులకు అందించే సేవలు, ఆహారం తదితర వివరాలను తెలుసుకున్నారు. పలు వార్డుల్లో సందర్శించి వైద్యం పొందుతున్న

వారిని, వారి సహాయకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి లోపల, బయట అన్ని చోట్ల స్వచ్ భారత్ ప్రణాలికను సంపూర్ణాంగా నిర్వహించండంతో పాటు, వార్డుల్లో

ఎటువంటి వ్యర్ధాలు నిల్వ ఉంచవద్దని సూచించారు. పేదలకు అత్యున్నత, మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఆసుపత్రి కి అవసరమయ్యే సామాగ్రిని అందించడంతో పాటు,

నిధులను కూడా సమకూర్చే విధంగా చర్యలు చేపడతానన్నారు. ప్రజలకు అందించే సేవల్లో ఎటువంటి ఉపేక్ష ఉండకూడదన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు నుంచి

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయని, సభ కార్యక్రమాల ప్రక్రియ మొదలైన తర్వాత కెజిహెచ్ అభివృద్ధి కై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్

రెడ్డి తో చర్చించడం జరుగుతుందన్నారు.  à°ˆ పర్యటనలో మంత్రి వెంట కెజిహెచ్ సూపరింటిండెంట్ డాక్టర్ అర్జున్, వివిధ విభాగాల ఇంచార్జ్ లు, డ్యూటీ వైద్యులు, వైద్య

విద్యార్థులు పాల్గొన్నారు.  

 

#dns  #dnslive  #dnsnews  #dnsonline  #dnsmedia  #dnsvizag  #vizag   #visakhapatnam  #avanthi  #KGH  #bhimili  #hospital  #inspection  #doctor  #Arjun  #patients  #north  #andhra  #uttarandhra  #CM  #chief  #Minister  #YS  #Jagan

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam