DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆముదాల వలస నుంచి అమరావతి వరకు తమ్మినేని ప్రస్థానం. . . 

ఆముదాల వలస నుంచి అమరావతి వరకు తమ్మినేని ప్రస్థానం. . . 

సభలో సిక్కోలుకు అత్యున్నత ప్రాధాన్యత 

( రిపోర్ట్  : ఎస్ వి ఆచార్యులు, ఫోన్ :  9246674585 , 9912005700

)

శ్రీకాకుళం, జూన్ 12 ,2019 (DNS Online ) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో కొలువైన నూతన సభలో  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా కు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేసిన మంత్రివర్గ కూర్పు లో సీనియర్ నాయకులకు అవకాశం లభించక పోవడం కొందరు అంతర్గతంగా మధన పడినట్టు బహిరంగ

రహస్యంగానే బయట పడింది. ఈ కూర్పు లో భాగంగా శ్రీకాకుళం జిల్లా కు చెందిన ధర్మాన కృష్ణదాస్ ను మంత్రివర్గం లోకి తీసుకోవడంతో జిల్లా కార్యకర్తల్లో ఆందోళన

మొదలైంది. అదే సమయంలో జిల్లాకే చెందిన సీనియర్ నాయకులు, ఆరు పర్యాయాలు ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి శాసన సభకు ఎన్నికవ్వడంతో పాటు మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం కల్గిన

తమ్మినేని సీతారాం ను ఆంధ్ర ప్రదేశం శాసన సభాపతిగా ఎన్నిక చేయడం తో జిల్లా వాసుల ఆనందానికి హద్దులేవు. అధికార పార్టీ తరపున గెలిచినా వారిలో ఆర్కే రోజా, బొత్స

సత్యనారాయణ, తదితరుల పేర్లు ఈ పదవికి ప్రస్తావనకు వచ్చినప్పడికీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం తమ్మినేని పేరే మొదటి నుంచి ప్రస్తావిస్తూ

వచ్చారు. 

 à°†à°®à±à°¦à°¾à°² వలస నుంచి అమరావతి వరకు . .: 

సుదీర్ఘ రాజకీయ చరిత్ర కల్గిన తమ్మినేని సీతారాం ఆమదాలవలస మండలం తొగరాం గ్రామంలో తమ్మినేని

శ్రీరామమూర్తి, ఇందుమతి దంపతులకు 1962 లో జన్మించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల నందు విద్య,  18à°µ యేటనే ఆముదాలవలస సుగర్ ఫ్యాక్టరీ డైరక్టర్ à°—à°¾ ఎన్నికవ్వడం,  1983

 à°²à±‹ తెలుగుదేశం పార్టీ ఆవిర్భించాక à°† పార్టీలో చేరి ఐదు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.  à°¤à±Šà°®à±à°®à°¿à°¦à±‡à°³à±à°³à°ªà°¾à°Ÿà± ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి, 18

శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. ప్రభుత్వ విప్ à°—à°¾ ఐదేళ్ళు, శాప్ డైరక్టరుగా మూడేళ్ళు సేవలు అందించిన అనుభవం ఉన్న ఏకైక వ్యక్తి. 

పార్టీల ప్రస్థానం,. . .

.:

రాజకీయ అరంగేట్రం తెలుగుదేశం లో చేసినప్పటికీ. . .  à°…భిప్రాయం భేదాలవల్ల టిడిపి ని వీడి,  à°ªà±à°°à°œà°¾à°°à°¾à°œà±à°¯à°‚ పార్టీ  à°²à±‹ చేరడం జరిగింది. అయితే à°† పార్టీ తరపున

ఎన్నికల్లో పోటీ చేసినా, ఓటమిపాలయ్యారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పిలుపు మేరకు . . తిరిగి మరోసారి ఆ పార్టీలో చేరి, రాష్ట్ర విభజన విషయం లో విభేదించి నాటి

ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. . . లో 2013 ఆగస్టు 29 à°¨  à°šà±‡à°°à°¾à°°à±. తదుపరి జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినా . . ఓటమే ఎదురయ్యింది.

అయితే ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం నుండి  à°µà±ˆ.ఎస్.అర్ పార్టీ తరుపున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూన రవికుమార్ పై

విజయం సాధించారు. 

ఇంత సుదీర్ఘ  à°°à°¾à°œà°•à±€à°¯ అనుభవం ఉండడంతో తమ్మినేని సీతారాం ను ముఖ్యమంత్రి సభాపతిగా ప్రకటించినట్టు తెలుస్తోంది. 

ఈయన నియామకంతో

శ్రీకాకుళం జిల్లాకు మహర్దశ పట్టే అవకాశం ఉంది. ప్రధానంగా సిక్కోలు ప్రాంతీయులకు ఎదురవుతున్న రైల్వే ప్రయాణ భారం సులభం కానుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam