DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్ఎస్ఎస్ జాతీయ సదస్సుకు బ్రాండిక్స్ దొరస్వామికి ఆహ్వానం

బ్రాండిక్స్ దొరస్వామికి ఆరెస్సెస్ నుంచి అరుదైన ఆహ్వానం   

16 à°¨ నాగపూర్ లో ఆరెస్సెస్  à°œà°¾à°¤à±€à°¯ శిక్షణ తరగతుల à°¸à°¦à°¸à±à°¸à± .  

విశాఖపట్నం, జూన్ 15 , 2019 (DNS Online ): భారత

దేశ సేవలో నిరంతరం తరిస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) దేశ సేవా సంస్థ నుంచి బ్రాండిక్స్ ఇండియా భారతీయ భాగస్వామి దొరస్వామి అరుదైన ఆహ్వానం

అందుకున్నారు. ఆరెస్సెస్ ఏటా యువతకోసం ప్రతిష్టాత్మకంగా నాగ్ పూర్ లో నిర్వహించే శిక్షణా తరగతులు, వార్షిక వేడుకల్లో పాల్గొనాల్సిందిగా దొరస్వామికి ఆహ్వానం

అందింది. à°ˆ నెల 16 à°¨ మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో à°—à°² ఆర్ ఎస్ ఎస్ కేంద్ర కార్యాలయం లో మూడవ సంవత్సర శిక్షార్థుల ముగింపు సదస్సు లో ఈయన పాల్గొనున్నారు.  à°¦à±‡à°¶à°‚ లో వివిధ

హోదాల్లో ఉండి సేవ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రముఖులను ఈ శిక్షణ తరగతుల ముగింపునకు ఆహ్వానించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే గత ఏడాది ఈ తరగతుల ముగింపు

వేడుకలకు భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. 

ఆర్.ఎస్.ఎస్ నలభై లక్షల సేవకులను కలిగి ఉన్న ప్రపంచం లోనే అతి పెద్ద స్వచ్ఛంద సంస్థగా ఖ్యాతి

గాంచింది.  à°¸à±‡à°µ, విద్య పరమైన హిందూజాతీయవాద కార్యక్రమాలని విస్తృతంగా నిర్వహిస్తుంది. ఆరెస్సెస్ లోని స్వయంసేవకులు ఏటా మూడు దశల్లో శిక్షణ పొందుతారు. మూడో దశ

శిక్షణలో 18 నుంచి 40 ఏళ్ల మధ్య యువతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. భారత దేశపు ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాల్ని నిలబెడుతూ సేవా కార్యక్రమాలతో జాతి

నిర్మాణంలో యువత కృషి చేసే లక్ష్యంగా ఈ శిక్షణ వుంటుంది. దేశం నలుమూలల నుంచి స్వయంసేవకులు హాజరయ్యే ఈ శిక్షణ కార్యక్రమాలను సందర్శించాల్సిందిగా దొరస్వామికి

ఆరెస్సెస్ మహానగర్ సంచాలాక్ రాజేష్ లోయా ఆహ్వాన పత్రం పంపడం జరిగింది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తరువాత జాతీయ బిజెపి నేతలు పాల్గొంటున్న నేపధ్యంలో ఈ సభ

 à°ªà±à°°à°¾à°§à°¾à°¨à±à°¯à°¤ సంతరించుకుంది. శిక్షణా తరగతులు సందర్సించడంతో పాటు à°ˆ సభలో పాల్గొనాల్సిందిగా దొరస్వామికి రాజేష్ లోయా పంపిన లేఖలో కోరారు. బ్రాండిక్స్ ఇండియా

తరుపున చేపడుతున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఆరెస్సెస్ జాతీయ సంస్థ నుంచి ఆహ్వానం అందుకోవడం పట్ల దొరస్వామి సంతోషం వ్యక్తం చేసారు. 

బ్రాండిక్స్

కు ఆహ్వానంకు కారణం : .

దేశ సేవలో తలమునకలైన ఆరెస్సెస్ తమ కార్యక్రమానికి బ్రాండిక్స్ అధినేతను ఆహ్వానించడం వెనుక వీరు చేస్తున్న సేవ కార్యక్రమాలే కారణం

గా తెలుస్తోంది. సుమారు 22 వేల మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్న బ్రాండిక్స్ ఇండియా ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించడం, ప్రతీ వారం

చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ వైద్య పరీక్షలు చేయించడం అద్భుతం. మహిళలకు ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాలు నిర్వహించారు.  à°‡à°Ÿà±€à°µà°² జరిగిన శిబిరం లో 1000 మంది హాజరుకాగా,

వారిలో 500 మందికి తనిఖీచేసి, 285 మందికి à°•à°‚à°Ÿà°¿ అద్దాలు, 80మందికి మందులు, 60 మందికి కేటారక్టు సర్జరీలు, 5 గురికి ఇతర శస్త్ర చికిత్సలు చేయించారు. 

 à°¨à°¿à°°à±à°¦à±à°¯à±‹à°— యువతీ

యువకులకు సాంకేతిక రంగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ఉపాధి కల్పించి ఎన్నో కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు దొరైస్వామి. యువతకు ఆదర్శంగా నిలిచిన

దొరైస్వామి విజయ రహస్యాన్ని, పోరాటంలో ఓర్పు తాడితర అంశాలను  à°¶à°¿à°•à±à°·à°¾à°°à±à°¥à±à°²à°•à± తెలియడం అవసరం అని భావించి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

#dns  #dnslive  #dnsnews  #dnsmedia  #dnsonline  #vizag  #visakhapatnam  #RSS 

#doraswamy  #dora  #brandix  #nagpur #training 
 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam