DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్వేతాంబర ధారి నుంచి కాషాయాంబర ధారిగా. . . . 

శ్వేతాంబర ధారి నుంచి కాషాయాంబర ధారిగా. . . . 

వైభవంగా విశాఖ శ్రీ శారదా పీఠ ఉత్తరాధికారి వేడుకలు

స్వాత్మానందేంద్ర సరస్వతి గా బాలస్వామి

సన్యాసాశ్రమం .. 

విజయవాడ,  à°œà±‚న్ 17 , 2019 (DNS Online ) : కృష్ణ తీరంలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమ ప్రాంగణం అంతా సోమవారం నారాయణ, నారాయణ, జయ జయ శంకర నామ స్మరణతో

మారుమ్రోగిపోయింది.  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚ వరకూ  à°¶à±à°µà±‡à°¤à°¾à°‚బరధారి (తెల్లని వస్త్రాలను ధరించి ) à°—à°¾ సంచరించి సామాన్య లౌకిక సమాజం లో పట్ల విరక్తి చెంది శ్రీవికారి నామ సంవత్సర

జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు ఇహపర  à°¬à°‚ధాలకు తెంచుకుని కాషాయాంబర దారి à°—à°¾ దర్శనమిచ్చిన బాలస్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి à°—à°¾ సన్యాస ఆశ్రమ స్వీకారం చెయ్యడమే à°ˆ

ఆధ్యాత్మిక శోభకు ప్రధాన కారణం. 

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి తమ పీఠ ఉత్తరాధికారి నియామకం, శిష్య స్వీకార మహోత్సవం

మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన యజ్ఞ యాగాదులు, శిరో ముండన, యజ్ఞోపవీత విసర్జన తదితర  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°²à°¨à± నిర్వహించారు. మూడవ రోజున

బాలస్వామితో కృష్ణ నదీ వందన చేయించి శ్వేత వస్త్ర విసర్జన చేయించే కార్యక్రమం బాలస్వామి కుటుంబ సభ్యులతో పాటూ చాలామంది భక్తులను కన్నీటి పర్యంతం చేయించింది.

అయితే ఒక్కసారిగా శ్వేత వస్త్ర విసర్జన చేయడంతో పాటూ, శారదా పీఠాధిపతులు కాషాయ వస్త్రాలను అందించడం, స్వామి నూతన వస్త్ర ధారణ చేయడం క్షణాల్లో జరిగిపోయింది.

భక్తులు కన్నీళ్లను తుడుచుకునే లోపే బాలస్వామి కాషాయాంబర దారిగా మారిపోయారు.  à°ˆ మహోత్సవానికి గణపతి సచిదానందా స్వామి శిష్యులు విజయానంద తీర్ధ స్వామి, తిరుమల

తిరుపతి దేవస్థాన అర్చక, అధికారులతో పాటు వెలది మంది భక్తులు ప్రత్యక్ష సాక్షులు à°—à°¾ నిలిచారు. 

 à°¸à°¾à°¯à°‚త్రం జరిగిన యోగపట్టా మహోత్సవం లో ఉభయ తెలుగు రాష్ట్రాల

ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( ఆంధ్ర ప్రదేశ్ ), కె. చంద్రశేఖర్ (తెలంగాణ), వివిధ పీఠాధిపతులు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దివ్య క్షేత్రాల అర్చక

శ్రేష్ఠులు, వివిధ పీఠాధిపతుల ప్రతినిధులు సమావేశమైన హైందవ సభ వేదిక నుంచి విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు తమ శిష్యులు, బాలస్వామికి స్వాత్మానందేంద్ర సరస్వతి గా

సన్యాస   దీక్షా నామ కారణం చేశారు. అనంతరం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అర్చక ప్రతినిధులు శ్రీనివాసుని  à°¶à±‡à°· వస్త్రం, ప్రసాదం అందించి మంగళశాసనములు అందించారు. అనంతరం

స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి తమ తొలి మంగళశాసనాన్ని సంస్కృతం లో అందించారు.

 

#dns  #dnslive  #dnsnews  #dnsmedia  #dnsonline  #vizag  #visakhapatnam  #balaswamy  #vijayawada  #sanyasa  #deeksha  #bjp  #visakha  #sharada  #peetham  #swatmanandendra  #saraswati  #swaroopanandendra 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam