DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టీచర్ల  ఆధిపత్య పోరులో రచ్చకెక్కిన అమ్మ ఒడి 

ప్రభుత్వ పాఠశాలలకే ఇవ్వాలి :ప్ర. పా. టీచర్లు 

25 శాతం ఫ్రీ సీట్లు నిబంధన రద్దు చేయాలి  . . . .:

ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలి:  à°ªà±à°°à±ˆà°µà±‡à°Ÿà±

విద్యా సంస్థలు 

ఇది కేవలం అధిపత్యానికి చేస్తున్న వ్యవహారం : ప్రయివేట్ టీచర్లు ...

కాకినాడ, జూన్ 20 ,2019 (DNS Online ): అమ్మ à°’à°¡à°¿ -  à°ªà°§à°•à°‚ ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లోని ఏ

పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్పించిన ప్రతి తల్లికీ రూ. 15 వేలు ఆర్ధిక ప్రోత్సాహకాన్ని అందిస్తానని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప పాదయాత్రలో

ప్రకటించారు. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇదే మాటను వ్యక్తం చేశారు.

అయితే తర్వాత 
జరిగిన పరిణామాల్లో ఈ పధకం కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారికే ఇస్తామంటూ ఆర్ధిక మంత్రి చేసిన ప్రకటన ప్రయివేట్ పాఠశాలల్లో

చదువుతున్న ప్రజల్లో ఆందోళనకు గురి చేసింది. దీని వెనక ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం పై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాయి. 

ప్రస్తుతం విద్యా

సంవత్సరం మొదలవ్వడంతో ప్రభుత్వ - ప్రయివేట్ టీచర్ల మధ్య తలెత్తిన అమ్మ ఒడి వివాదం రచ్చకెక్కింది. అన్ని పాఠశాలలకూ వర్తిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరూ చేరారు

అంటూ ప్రభుత్వ టీచర్లు విద్యా  à°¶à°¾à°–à°¾ కమిషనర్ పై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. అంతే  à°®à°‚త్రిత్వ శాఖా లో చర్చలు జరిగి దీన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలలకే అంటూ ఆర్ధిక

మంత్రి పత్రికాముఖంగా ప్రకటన చేసేసారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు సైతం ఆందోళనంలో పడ్డాయి. 

ప్రభుత్వ ఉద్యోగుల  à°ªà°¿à°²à±à°²à°²à± ప్రభుత్వ

స్కూళ్లలోనే చదవాలి :

అమ్మ à°’à°¡à°¿ పధకం కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేస్తే. ..  à°ªà±à°°à°­à±à°¤à±à°µ పాఠశాలలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే రాష్ట్ర ప్రభుత్వ

ఉద్యోగులందరూ తమ పిల్లలను కేవలం ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని ప్రయివేట్ స్కూళ్ల యాజమాన్యాలు, ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగాలు ప్రభుత్వ

పాఠశాల్లో చేస్తూ, తమ పిల్లలను ప్రయివేట్ స్కూలుకు ఎందుకు పంపుతున్నారు అని ప్రశ్నించారు. తమ విద్యావిధానంపై వారికే నమ్మకం లేక ప్రయివేట్ స్కూళ్లను

ఆశ్రయిస్తున్నారని మండిపడ్డారు. 

ప్రభుత్వ పధకాలు కేవలం ప్రభుత్వం పాఠశాలలకే వర్తింప చేస్తే, ప్రభుత్వ ఉద్యోగులకూ అదే నిబంధనలు వర్తింపచేయాలని వీళ్ళు

డిమాండ్ చేస్తున్నారు. 

 25 శాతం  à°«à±à°°à±€ సీట్ల నిబంధన రద్దు చేయాలి . . . 

ఇప్పడికే 25 శాతం ఉచితంగా సీట్లు ఇవ్వడంతో ఆర్ధికంగా నష్టాల్లోకి ప్రయివేట్ స్కూళ్ళు

పడిపోతున్నాయన్నారు. ఇక ప్రభుత్వ పధకాలు కూడా అమలు కాక పొతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది స్కూళ్ళు మూతపడిపోయి లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడతారని

మండిపడుతున్నారు. ప్రభుత్వ పధకాలు అమలు చెయ్యని పక్షంలో 25 శాతం ఫ్రీ సీట్లు తప్పని సరి నిబంధనలను రద్దు చేయాలనీ ప్రైవేట్ స్కూళ్ళు డిమాండ్

చేస్తున్నాయి. 

ప్రధాన కారణం ఇదే . . . . :

రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి పధకాన్ని అందరికీ అమలు చేస్తున్నట్టు ప్రకటించగానే తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని

ప్రయివేట్ స్కూళ్ల యాజమాన్యాల ప్రతినిధులు ముఖ్యమంత్రి à°•à°¿ కృతజ్ఞతలు తెలుపుతూ పలు చోట్ల " అమ్మ à°’à°¡à°¿ ని  à°…న్ని పాఠశాలలకూ వర్తింపచేస్తున్న ముఖ్యమంత్రికి

ధన్యవాదములు " అంటూ  à°¹à±‹à°°à±à°¡à°¿à°‚గ్ లు పెట్టారు. ఇప్పడికే ప్రభుత్వ - ప్రయివేట్ ఉపాధ్యాయ సంఘాల మధ్య ఉన్న విభేదాలు దీంతో రోడ్డెక్కాయి. తూర్పు గోదావరి జిల్లా

ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు దీన్ని సీరియస్ à°—à°¾ తీసుకుని విద్యా శాఖా కమిషనర్ ముందు శ్రీముఖం పెట్టారు. అంతే నిబంధన రాత్రికి రాత్రే మారిపోయింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam