DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిబద్దత గల అధికార బృందమే మా అదృష్టం: వైఎస్ జగన్

విజయవాడ, జూన్ 24 , 2019 ( DNS Online ) : ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి మంచి అనుభవం, నిబద్దత గల ఉన్నతాధికారుల బృందం లభించడం నా అదృష్టంగా

భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.  
విజయవాడలోని బెరం పార్క్ లో  à°à°à°Žà°¸à± అధికారుల అసోసియేషన్ ఆధర్వర్యంలో ఏర్పాటు

చేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ అధినేతలు తీసుకునే నిర్ణయాలు ఆచరణీయమా కాదా అనేది నిర్ణయించి, అమలు

చెయ్యగలిగిన వారు అధికారులు మాత్రమేనన్నారు. అనుభవజ్ఞులైన మీ మార్గదర్శకత్వం, సహకారంతో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దగలననే

నమ్మకం నాలో కలిగిందన్నారు. తాను పాదయాత్రలో పలు హామీలు ఇచ్చే ముందు మీ అందరి నిబద్దత, ప్రజల పట్ల ఆత్మీయతలు దృష్టి లో పెట్టుకున్నట్టు తెలిపారు. 
ఈ రోజు ఉదయం

కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నా మదిలో ఉన్న ఆలోచనలు మీ అందరితో పంచుకున్నానని, మీ ప్రేమను, అభిమానాన్ని చూరగొనడం చాలా సంతోషకరమైన విషయమని ముఖ్యమంత్రి ఆనందాన్ని

వ్యక్తం చేశారు. ఈ సమావేశం లో ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు మన్మోహన్ సింగ్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రికి మెమెంటో అందజేసి, శాలువాతో సత్కరించారు. ప్రభుత్వ

ప్రధాన కార్యదర్వి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఐఏఎస్ ఉదయలక్ష్మి ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. రాష్ట్రానికి చెందిన ఐఏఎస్, ఉన్నతాధికారులందరూ

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam