DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మీడియా అత్యుత్సాహం తో నాకే అనుమానం వచ్చేసింది. : గంటా

దేశాన్ని వీడేది లేదు, నాపై అభూతకల్పనలు కొత్తకాదు : à°—à°‚à°Ÿà°¾ 

ప్రజా వేదిక కూల్చివేత పై పునరాలోచన చెయ్యాలి :.

విశాఖపట్నం, జూన్ 25 , 2019 ( DNS Online ) : గంటా శ్రీనివాసరావు

తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ లోకి వెళ్తున్నారంటూ కొన్ని సోషల్ మీడియా అత్యుత్సాహం కారణంగా నాకే అనుమానం వచ్చేసిందని మాజీ మంత్రి, విశాఖ ఉత్తర

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. మంగళవారం నగరం లోని ఒక హోటల్ లో నిర్వహించిన ఉత్తర నియోజక వర్గ కార్యకర్తల సమావేశం లో అయన మాట్లాడుతూ తానూ

తెలుగుదేశం పార్టీని వీడేది లేదని తెలిపారు. తనపై ఆరోపణలు రావడం కొత్త కాదని, ఇలాంటి వార్తలు ఎన్నికల ముందు ప్రచారం చేశారు, ఎన్నికల్లోనూ చేశారు, ఫలితాలు వచ్చాక

కూడా నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. మాజీ మంత్రి గంటా టీడీపీ నుంచి బీజేపీ లోకి వెళ్తున్నారని, తన వెంట 15 మంది ఎమ్మెల్యే లు ఉన్నారని, ప్రస్తుతం

కొలంబో లో క్యాంపు నిర్వహిస్తున్నారంటూ పుకార్లు ప్రతి టీవీ, సోషల్  à°®à°¾à°§à±à°¯à°®à°¾à°²à±à°²à±‹ విస్తృతంగా ప్రచారం కావడం తో  à°ªà±à°°à°¤à°¿ రోజు వందలాదిగా ఫోన్లు రావడం తో నాపై నాకే

అనుమానం వచ్చిందని గంటా తెలిపారు. అయితే ఇవన్నీ అవాస్తవాలన్నారు. తన వ్యక్తిగత పనులపై, శ్రీలంక లోని ట్రింకోమలి లోని శక్తి పీఠం దర్శనం కోసం కొలంబో వెళ్లినట్టు

తెలిపారు. తన వెంట ఒక్క ఎమ్మెల్యే కూడా రాలేదన్నారు. ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ సమన్వయకర్తల సమావేశం నిర్వహిస్తున్నామని వివరించారు. ఎన్నికల

ఫలితాల తర్వాత తానూ నగరంలో కార్యకర్తలకు అందుబాటులో లేనందున, à°ˆ రోజు à°ˆ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. 

ప్రజా వేదిక కూల్చివేత పై పునరాలోచన చెయ్యాలి

:.

ఆంధ్ర ప్రదేశ్ లో జిల్లా కలెక్టర్లు,  à°…ధికారులతో సమావేశాలు నిర్వహించాలంటే అనువుగా ఉండేందుకు ప్రజా ధనం తో నిర్మించినదే ప్రజావేదిక అని, దానికి à°’à°•à°Ÿà°¿

రెండు అనుమతులు లేవు అనే సాకుచూపిస్తూ కూల్చివేయడం సరిదన్నారు. అక్రమం గా నిర్మించిన నిర్మాణాలను కూల్చడం సరికాదని, అయితే దీన్ని కూల్చేస్తే. . ప్రతి మూడు

నెలలకోసారి జరిగే ఉత్తానాధికారుల సమావేశం నిర్వహించడానికి ఇంకో వేదిక లేదన్నారు. లేని పక్షంలో ఏదేని స్టార్ హోటల్ లో సమావేశం నిర్వహించు కోవాలన్నారు. దీని

కూల్చివేతపై పునరాలోచన చేయాలన్నారు. రాష్ట్రం లో అక్రమం à°—à°¾ నిర్మించిన కట్టడాలన్నీ కూల్చిన తర్వాతే దీనిపై ఆలోచన చెయ్యాలని సూచించారు. 

అనంతరం

విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో టీడీపీ విశాఖపట్నం నగర అధ్యక్షులు డాక్టర్ ఎస్ ఏ రెహ్మాన్,

అధికార ప్రతినిధి కాశి, తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dnsnews  #dnsmedia  #dnsonline  #vizag  #visakhapatnam  #ganta  #srinivasarao  #telugudesam  #party  #TDP  #vizag  #visakhapatnam  #chandrababu  #naidu  #YS  #Jagan  #Mohan  #Reddy  #Praja  #vedika  #vijayawada  #karakatta  #Rahman   
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam