DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పిల్లలు ఉండవలసింది బడిలోనే పనికి కాదు: మంత్రి వెలంపల్లి

పిల్లలు ఉండవలసింది బడిలోనే పనికి కాదు 

అందరికీ విద్య రాజన్న ప్రభుత్వ లక్ష్యం 

దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు.

విజయవాడ, జూన్‌ 29, 2019  (

డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ లోని చిన్న పిల్లలు ఉండవలసింది బడిలోనే తప్ప, పనిలో కాదని, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం

విజయవాడ భవనిపురం స్వాతి సెంటర్ లో ఉర్దూ పాఠశాల విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అయన మాట్లాడుతూ రాష్ట్రం లోని ప్రతి చిన్నారి

తప్పని సరిగా ఏదేని పాఠశాలలో చదువుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మఒడి పధకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ సందర్భంగా

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ప్రోత్సాహకానికి అదనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు

తమ వంతు సహకారంగా విద్యార్థులకు సహకారాన్ని అందించడం అభినందనీయమన్నారు. పార్టీ కార్యకర్తలు సైనికుల మాదిరి గా సేవ చెయ్యాలనే లక్ష్యంతో విద్యార్థులకు ఉచిత

పుస్తకాల పంపిణీ చెయ్యటం మరింత మందికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు.  à°‰à°°à±à°¦à±‚ స్కూల్ అభివృద్ధికి పూర్తి సహకరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఉర్దూ పాఠశాల ప్రధాన

ఉపాధ్యాయులు మహమ్మద్ ఉమర్ అలి, వై యస్ ఆర్ సిపి 27 వ డివిజన్ అద్యక్షులు ఆంజనేయ రెడ్డి, నాయకులు మహమ్మద్ ఇర్ఫాన్, ఖాదర్,అన్వర్, తదితర నాయకులు పాల్గొన్నారు.
 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam