DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత మహిళా లోకం గర్వించే రోజు ఇది : తోట విజయలక్ష్మి 

మొదటి మహిళా ఆర్ధిక మంత్రి తోలి బడ్జెట్...

మహిళకు భాద్యత ఇస్తే దేశం బాగుపడుతుంది...

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి . .

. .

విశాఖపట్నం, జులై  04 , 2019 (డిఎన్‌ఎస్‌) : భారత మహిళా లోకానికి గర్వించే రోజు ఇది అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి అభిప్రాయం

పడ్డారు. భారత దేశ చరిత్రలో భారత పార్లమెంట్ లో శుక్రవారం à°’à°• మహిళా ఆర్థిక మంత్రి (నిర్మలా సీతారామన్) దేశ బడ్జెట్ ను  à°®à±Šà°Ÿà±à°Ÿ మొదటి సారిగా ప్రవేశ పెడుతున్నారన్నారు.

ఇంతకూ ముందు ఎన్నడూ  à°²à±‡à°¨à°¿ విధంగా మొదటి సారి పూర్తి స్థాయిలో à°’à°• మహిళకు దేశ ఆర్ధిక వ్యవస్థను నడపమని బాధ్యతలు అప్పగించిన ఘనత నరేంద్ర మోడీకే

దక్కుతుందన్నారు. 

ఒక మహిళా విద్యావంతురాలైతే ఆ ఇల్లు బాగుపడుతుందని, తద్వారా ఊరు అభివృద్ధి చెందుతుందనే ఆర్యోక్తి ని ఆదర్శంగా తీసుకుని ప్రధాని మోడీ దేశ

ఆర్ధిక భాద్యత à°’à°• మహిళకు అప్పగించారన్నారు.  

భారత దేశమంతా కోటి ఆశలతో ఎదురు చూస్తున్న తరుణమిడి అన్నారు. ఇప్పటికే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న

బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్ధిక వ్యవస్థను మరింత పటిష్ట పరిచే వైపు అడుగులు వేస్తుందన్నా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కొన్ని సూచనలు

చేశారు. 

యువతకు అవకాశాలు ఇవ్వాలి :.

యువతకు అందించే ఉపాధి పథకాలైన ముద్ర ఋణాలు, స్టాండ్ అప్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లాంటివి మరింత

రూపాంతరం చెందాలని సూచించారు. 

రైతులందరికి లబ్ది కలగాలి: .

భూమి ఉన్న రైతులకు మాత్రమే కాకుండా, ఇతరుల భూములను  à°•à±Œà°²à± కు రైతు కూడా సంపూర్ణ లబ్ది

అందించాలన్నారు. 

జీఎస్టీ ని సరళీకృతం చెయ్యాలి:.

జి ఎస్ టి విధానం మరింత సరళీకృతం అయ్యి చిన్న వ్యాపారులు తిరిగి పుంజు కునేలా చర్యలు

తీసుకోవాలన్నారు. 

అందరికీ ఇల్లు:.

అందరికీ ఇళ్ళు అనే మోడీ ప్రభుత్వ లక్ష్యానికి, ప్రతి కుటుంబం ఇల్లు కట్టుకోవడానికి భూమి ( రియల్ ఎస్టేట్ ) ధరలు మరింత

అందుబాటులోకి తీసుకు రావాలి. విక్రయించే వారికి టాక్సల ద్వారా రాయితీ లు ఇచ్చినచో ఇరువైపుల లబ్ది ఉంటుందన్నారు.  

అందరికి పెన్షన్:.

పేద, బడుగు, బలహీన

వర్గాలకు, అసంఘటిత రంగ కార్మికులు, చిరు వ్యాపారులు, రైతులకు ఇప్పటికే మోడీ ప్రభుత్వం పెన్షన్ పధకాల ద్వారా తలెత్తుకుని బ్రతికే అవకాశాన్ని ఇచ్చిందన్నారు.

దీన్ని మరింత మెరుగ్గా కొనసాగించాలని సూచించారు.

విద్య. . ఆరోగ్యం:.

అందుబాటులోకి ఉన్నత విద్యా, ఆరోగ్యమును అయుష్మన్ భారత్ ను అమలు లోకి తీసుకు

వచ్చిందని. వీటిని మరింత పటిష్ట పరచడం, చేరువలోకి వచ్చేలా సరళీకృతం చేయాలన్నారు.   

రక్షిత నీటి ప్రాజెక్టులు :.

రక్షిత త్రాగునీరు, మధ్య, చిన్న తరహా నీటి

పారుదల ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టి, ఆంధ్ర ప్రాంతంలో ఆరంభించిన ప్రాజెక్ట్ లను త్వరిత గతిన పూర్తి చేసేందుకు నిధులతో పాటు సాంకేతిక విధానాన్ని కూడా

అందించాలన్నారు. తద్వారా ఆంధ్ర ప్రదేశ్ తో పాటు సరిహద్దు రాష్ట్రాలకూ లబ్ది కలుగుతుందన్నారు. 

ఇలా మన ప్రభుత్వం ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టి ముందుకు

నడుపుతున్న తరుణం లో.... మరెన్నో నూతన విధానాలను ఆశిస్తున్నామన్నారు.

 

#dns  #dnslive  #dnsnews  #dnsonline  #dnsmedia  #vizag  #visakhapatnam  #CA  #ICAI  #National  #nirmala  #seetaraman  #andhra  #pradesh  #india  #parliament  #budget  #woman  #finance  #minister  #narendra  #modi  #prime  #minister

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam