DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అభివృద్ధి చెయ్యమంటే ఆలయాలు కూల్చేశారు : దేవాదాయ మంత్రి వెల్లంపల్లి

ఐదేళ్ల కాలంలో అభివృద్ధి ని పాతాళానికి తొక్కేశారు 

దశల వారీగా దేవాలయాల అభివృద్ధి చేస్తాం: 

రాష్ట్రంలో టెంపుల్ టూరిజం ను అభివృద్ధి

చేస్తాం

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు . .

(రిపోర్ట్ : S V ఆచార్యులు, స్పెషల్ కరస్పాండెంట్).

శ్రీకాకుళం, జులై  06 , 2019 (డిఎన్‌ఎస్‌) :

రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యమని ప్రజలు ఓటేస్తే చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని ఆలయాలను కూల్చేశారని, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి

శ్రీనివాసరావు మండిపడ్డారు. జిల్లా ఇన్ ఛార్జి మంత్రి గా భాద్యతలు చేపట్టిన తదుపరి మంగళవారం తొలిసారి జిల్లాకు వచ్చిన జిల్లాలోని అరసవల్లి సూర్యదేవాలయాన్ని,

శ్రీకూర్మం లోని శ్రీకూర్మనాధుని ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లోని దేవాలయాల అభివృద్ధి ని దశలవారీ చేపట్టేందుకు ఒక

ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కంటే గోదావరి పుష్కరాల్లో భక్తుల మృత్యువాత, కృష్ణ పుష్కరాల పేరుతో ఆలయాల కూల్చివేత

లాంటి దుర్ఘటనలో కనిపిస్తున్నాయి తప్ప అభివృద్ధి మాత్రం కానరాలేదన్నారు. à°®à±à°–్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్‌ రెడ్డి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక

దృష్టి సారించారట్లు తెలిపారు.  

టెంపుల్ టూరిజం అభివృద్ధి :. .

రాష్ట్రంలో టెంపుల్ టూరిజం ను అభివృద్ధి చేస్తామని, ప్రతి ఆలయంలోనూ భక్తులకు ఇబ్బంది

లేకుండా సదుపాయాలను కల్పిస్తామన్నారు. జిల్లా మంత్రి ధర్మాన కృష్ణదాసు కోరిన విధంగా త్వరలోనే శ్రీకూర్మంలో నిత్య అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నట్టు

తెలిపారు.

అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లాలో దశల వారీగా దేవాలయాలు, టూరిజం వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.

అరసవల్లి శ్రీ

సూర్యనారాయణ స్వామి ఆలయం, శ్రీకూర్మం లోని శ్రీ కూర్మనాథ స్వామి ఆలయం సహా శ్రీముఖలింగం అభివృద్ధి కి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్టు మంత్రి వివరించారు.

శ్రీకాకుళం జిల్లాలో 12 దేవాలయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. 

అంతకు ముందు దేవాదాయ శాఖా మంత్రి బృందానికి ఆలయ సాంప్రదాయంగా అర్చకులు  à°ªà±‚ర్ణకుంభంతో

స్వాగతం పలికారు. ఆలయ విశిష్టతను అర్చకులు శంకర శర్మ మంత్రికి వివరించారు.

ఇంచార్జి మంత్రి తో పాటు రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాసు, జిల్లా

అధికారులు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి,  à°ªà°²à±à°µà±à°°à± నేతలు పాల్గొన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam