DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అత్యంత ప్రాశస్త్యం దీక్షగా చేయాల్సిన యజ్ఞం చాతుర్మాస్యం

సన్యాసులు తప్పని సరిగా పాటించాల్సిన నియమం 

గృహస్తులు, బ్రహ్మచారులు పాటిస్తే మంచిది 

(రిపోర్ట్ : సాయిరామ్ చిలకమఱ్ఱి, బ్యూరో,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ).

.

విశాఖపట్నం, జూలై 12, 2019  (డిఎన్‌ఎస్‌) : సంవత్సర కాంలో అత్యంత ప్రాశస్త్యం కల్గినది ఆషాఢ మాసం, ప్రధానంగా సన్యాసం స్వీకరించి, నిత్యం భగవన్నామ స్మరణలో ఉండే

యతులకు, పీఠాధిపతులు, సన్యాసులకు ఎంతో అనుబంధం కల్గిన మాసం ఇది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు న అత్యంత సంప్రదాయబద్దంగా దీక్ష ప్రారంభించి, నాలుగు నెల కాలం పాటు ఒకే

ప్రాంతం లో నివాసం ఉండి తమకు తెలిసిన, ఇంకా తెలుసుకోవాల్సిన గ్రంధాలను అభ్యసిస్తూ, అభ్యసించిన వాటిని భక్తులకు వివరిస్తూ కాలక్షేపం చేయడం ఆనవాయితీగా

వస్తోంది. ఈ రోజు నుంచి నాలుగు నెలల కాలం అంటే ఆషాడ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ కొనసాగే ఈ దీక్షా యజ్ఞం అత్యంత కఠినంగా పాటించడం జరుగుతుంది.

వాటిల్లో ప్రధానమైనది ఆహార నియమం. మొదటి నెలలో కూరలు తినకూడదు, రెండవ నెలలో పెరుగు ముట్టుకోకూడదు, మూడవ నెలలో పాలు స్వీకరించకూడదు, నాల్గవ మాసం లో పప్పు దినుసులు

తినరాదు అన్నది నియమం. తద్వారా ఆహారం పై సన్యాసులకు, యతులకు ద్రుష్టి ఉండకుండా కేవలం జీవించి ఉండడం కోసమే ( అంటే ప్రాణం నిుపుకోవడం కోసమే) ఆహార స్వీకరణ చెయ్యాలి

అనేది పూర్వ కాలం లోనే మహర్షులు నిర్దేశించారు. ఈ దీక్ష పాటించేవారు ఈ నాలుగు నెల కాలం లో ఒకే చోట నివాసం ఉండి, కర దీక్షగా ఈ కార్యక్రమాన్ని ఆచరించాలి అన్నది

నియమం. దీనికి ఒక ప్రధాన కారణం కూడా ఉండి. ఈ నాలుగు నెల కాలం లో వర్షాలు పడే కాలం. సన్యాసులు, యతులు ఊరూరా తిరుగుతూ కాలం వెళ్లదీస్తుంటారు. వర్షా కాలం లో బయట తిరిగితే

వర్షాలు బారిన పడి నానా అవస్థలు పడవలసి వస్తుంది. కనుక à°ˆ కాలం లో ఒకే చోట ఉండి భగవన్నామ స్మరణతో గడపాలి అన్నది నియమం. 
కాలాంతరం లో అనేక కారణా వలన నాలుగు నెలలు

ఆచరించవలసిన ఈ దీక్షను రెండు నెలలకు కుదించి ఆచరించడం కూడా జరుగుతోంది. అయితే నాలుగు నెల కాలం లో చెయ్యవలసిన కార్యాచరణ పూర్తిగా ఈ రెండు నెలల్లోనే పూర్తిచేయడం

జరుగుతుంది. ప్రధానంగా అన్ని ఆలయాల్లోనూ ఈ నాలుగు నెల కాలం లో అత్యంత వైభవంగా సేవా కార్యక్రమాలు ఆచరించడం జరుగుతుంది. ఇది ఏ ఒక్క ఆగమానికో, లేదా శ్రీవైష్ణవ, శైవ

సంప్రదాయాలకు పరిమితి కాదు, సన్యాసం స్వీకరించిన ప్రతీ ఒక్కరూ ఆచరిస్తుంటారు. దీక్ష అనంతరం వారి తపశ్శక్తి రెట్టింపు అవుతుంది అన్నది అక్షర సత్యం. ఈ సమయం లోనే

వారి వారి ఆశ్రమాల్లో పు ఆధ్యాత్మిక కార్యక్రమాు నిర్వహించి, పెద్ద సంఖ్యలో భక్తును ఆహ్వానిస్తుంటారు. తద్వారా హైందవ సంస్కృతి   దశ దిశలా వ్యాప్తిచెందుతుంది. 
/> ఇది కేవలం  à°¸à°¨à±à°¯à°¾à°¸à°‚ తీసుకున్న వారే ఆచరించాలి అన్న నియమం లేదు, గృహస్తులు , బ్రహ్మచారులు, కూడా చెయ్యవచ్చు. వాటికి కనీస నియమాలు మాత్రం తప్పనిసరిగా

పాటించాల్సియుంటుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam