DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరి ప్రదక్షిణ, : నమో నరసింహ నామం తో మారు మ్రోగిన విశాఖ వీధులు 

వేలాది భక్తులు తో వైభవంగా సాగిన సింహగిరి ప్రదక్షిణ, . . . .

విస్తృత ఏర్పాట్లలో సేవా సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం  

అడుగడుగునా మంచినీరు, ప్రసాదం, వితరణ,

మందుల పంపిణీ 

భక్త జన సేవలో జాతీయ పాత్రికేయ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు 

సింహగిరిపై విస్తృత ఏర్పాట్లు : ఆలయ సిబ్బంది 

(రిపోర్ట్ : కళ్యాణి

సివిఎస్ , స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, జులై  15 , 2019 (డిఎన్‌ఎస్‌): ఆషాఢ శుద్ధ చతుర్దశి ని పురస్కరించుకుని సాగిన సింహగిరి ప్రదక్షిణ లో నమో నరసింహా,

సింహాద్రి నాధా నమ స్మరణతో సోమవారం విశాఖ వీధులు మారుమ్రోగిపోయాయి.   ఉత్తరాంధ్రా వాసుల ఇలవేల్పు à°—à°¾ వేలాదిమంది తో కొలవబడుతున్న శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి

కొలువైన క్షేత్రం సింహగిరి.  à°¸à±à°®à°¾à°°à± 32 కిలోమీటర్ల విస్తీర్ణం కల్గిన à°ˆ పవిత్ర గిరిని ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు (సోమవారం ) వేలాది మంది భక్తులు కాలినడక à°¨ à°ˆ à°—à°¿à°°à°¿

ప్రదక్షిణ పూర్తి చేసారు. తదుపరి రోజైన ఆషాఢ శుద్ధపౌర్ణమి రోజున ( మంగళవారం ) సింహాద్రి నాధుని దర్శనం కోసం ముందుకు సాగారు. ఈ యాత్రలో పాల్గొనే భక్తులకు తమ వంతు సేవా

చేసుకోవాలని సంకల్పనతో వందలాదిగా సేవా సంస్థలు మార్గ మధ్యలో వివిధ కౌంటర్లు ఏర్పాటు చేసి మజ్జిగ, పానీయాలు, పళ్ళు, అన్న ఆహార పదార్థాలు, మంచి నీరు ఉచితంగా వితరణ

చేస్తున్నారు. మరి కొన్ని సంస్థలు, భక్తులకు కాళ్ళ నొప్పులు తగ్గడానికి తగిన ఉపశమనం కల్గించే మందులను ఉచితంగా ఇవ్వడం తో పాటు, పెద్దవాళ్ళు, మహిళలు నొప్పులతో

బాధపడే వారికి తైల మర్దన కూడా చేపట్టారు. à°ˆ యాత్రలో ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలైన హరే కృష్ణ మూవ్మెంట్, ఇతర భక్త బృందాలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. 

భక్త జన

సేవలో విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల:

 à°¸à°¿à°‚హగిరి ప్రదక్షిణ పర్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు, జాతీయ పాత్రికేయ సంఘం

కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు నడక మార్గంలో గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు పాలు, పళ్ళు, అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత

కొన్నేళ్లుగా ఈ సేవ కార్యక్రమం లో తమ కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు సేవ చేసుకునే భాగ్యం కలుగుతోందని తెలిపారు. తాము కూడా ఈ గిరి ప్రదక్షిణను నడక ద్వారా

చేస్తున్నట్టు వివరించారు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటె తప్ప నడక ద్వారా à°—à°¿à°°à°¿ ప్రదక్షిణ చెయ్యడం సాధ్యం కాదన్నారు. 
 
తోలి పావంచా వద్ద మొదలు : 

ఆషాఢ శుద్ధ

చతుర్దశి రోజున ( జులై 15 à°¨) సింహాచలం క్షేత్రం లోని తొలిపావంచా వద్ద కొబ్బరి కాయ కొట్టి భక్తులు కాలినడకన à°—à°¿à°°à°¿  à°ªà±à°°à°¦à°•à±à°·à°¿à°£ ను మొదలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. à°ˆ

యాత్ర సింహాచలం, అడవివరం, సెంట్రల్ జైలు, ముడసర్లోవ, హనుమంతవాక, వెంకోజీపాలెం, హెచ్ బి కోలనీ, కైలాసపురం, సాలగ్రామపురం, మాధవ ధర, మురళీనగర్, ఎన్ ఎస్ టి ఎల్, ఎన్ ఏ డి

కొత్తరోడ్డు, బుచ్చిరాజపాలెం, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, గోశాల మీదుగా సింహాచలం చేరుకుంటారు. 

ఈ యాత్ర కు ఈ ఏడాది లక్షలాదిగా భక్తులు హాజరవుతారని అధికారులు

అంచనా వేస్తున్నారు.  à°¯à°¾à°¤à±à°°à°²à±‹ ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా  à°ªà±‹à°²à±€à°¸à± బందోబస్తు ఏర్పాట్లూ పూర్తయ్యాయి. యాత్ర పూర్తి చేసుకున్న భక్తులు మరునాడు సింహగిరి à°•à°¿

వచ్చి, స్వామిని దర్శించుకుంటారు. దీనికై సింహాచల దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలియచేస్తున్నారు. 

మహానుభావుల ఆవిర్భావం కూడా ఇలాగే

:

తెలుగు రాష్ట్రాలను తన శ్రీరామాయణ, మహాభారత, భాగవత, తిరుప్పావై ప్రవచనాలతో ఉత్తేజిత పరిచిన శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి సైతం ఈ గిరి ప్రదక్షిణ ఫలితమే అని

చెప్తుంటారు. వారి తల్లిదండ్రులు గిరి ప్రదర్శిన చేసి తమకు ఉత్తమ సంతానాన్ని కల్గించమని స్వామిని మొక్కుకుని గిరి ప్రదక్షిణ చేసిన అనంతరం శ్రీభాష్యం వారు

జన్మించినట్టు విశాఖ వాసులందరికీ తెలిసిందే. à°—à°¿à°°à°¿ ప్రదక్షిణ చేస్తే భూమండల ప్రదక్షిణతో సమానమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 

సముద్ర స్నానాలు :

కాలినడక

చేసే భక్తుల్లో చాలామంది తెల్లవారు ఝామున సముద్ర స్నానాలు సైతం పూర్తి చేసుకుని తిరిగి నడక ను కొనసాగిస్తుంటారు. 

సంవత్సరం అంతా చందన అలంకారంతో ఉండే శ్రీ

వరాహ లక్ష్మి నృసింహ స్వామికి ఆషాఢ పౌర్ణమి నాడు ఆఖరి విడత 12 మణుగుల చందన సమర్పణ జరుగుతుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam